Tejasvi Surya: రాహుల్ గాంధీతో చర్చకు బీజేవైఎం సిద్ధం.. అభినవ్ ప్రకాశ్ పేరు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, ‘ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది’ అని రాశారు. బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ.. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎపి షాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్ కూడా సంతకం చేశారు. బహిరంగ చర్చకు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ప్రధాని ఇందులో పాల్గొంటారని దేశం ఆశిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, రాహుల్ గాంధీకి కాంగ్రెస్లో కూడా విశ్వసనీయత లేదని, మోడీతో చర్చించడానికి ఎలాంటి అర్హత లేదని బీజేపీ చర్చా ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ పేరును ఖరారు చేస్తూ.. కాంగ్రెస్ కు లేఖ రాశారు. ఈ లేఖను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
READ MORE: Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టీడీపీ- వైసీపీ నేతల మధ్య మరోసారి వివాదం..!
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
‘మీ ఆమోదం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడు, ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక చారిత్రాత్మక చర్చకు వేదిక సృష్టించవచ్చు.” అని తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అభినవ్ ప్రకాష్ పాసి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా విద్యావంతుడని తన లేఖలో పేర్కొన్నారు. ఇంతలో, అభినవ్ ప్రకాష్ తనతో రాహుల్ గాంధీ చర్చకు సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నట్లు ఎక్స్లో రాశారు. అభినవ్ ప్రకాష్ తన X పోస్ట్లో, ‘నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తేజస్వి సూర్య. రాహుల్ గాంధీ నాతో చర్చకు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పాలన, ఉపాధి ఇలా అన్ని విషయాలపై బహిరంగ చర్చ జరగాలి.” అని రాసుకొచ్చారు.
Dear Rahul Gandhi Ji,
BJYM has deputed Sri @Abhina_Prakash, our VP, to debate with you.
He is a young and educated leader from the Pasi (SC) community, who are around 30%, in Rae Baraeli.
It will be an enriching debate between a political scion and a common youngster who… pic.twitter.com/8FarSmqrQe
— Tejasvi Surya (ಮೋದಿಯ ಪರಿವಾರ) (@Tejasvi_Surya) May 13, 2024
- Tags
- Abhinav Prakash
- bjp
- Bjym
- congress
- modi
తాజావార్తలు
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ట్రెండింగ్
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!