Tejasvi Surya: రాహుల్ గాంధీతో చర్చకు బీజేవైఎం సిద్ధం.. అభినవ్ ప్రకాశ్ పేరు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, ‘ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది’ అని రాశారు. బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ.. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎపి షాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్ కూడా సంతకం చేశారు. బహిరంగ చర్చకు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ప్రధాని ఇందులో పాల్గొంటారని దేశం ఆశిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, రాహుల్ గాంధీకి కాంగ్రెస్లో కూడా విశ్వసనీయత లేదని, మోడీతో చర్చించడానికి ఎలాంటి అర్హత లేదని బీజేపీ చర్చా ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ పేరును ఖరారు చేస్తూ.. కాంగ్రెస్ కు లేఖ రాశారు. ఈ లేఖను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
READ MORE: Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టీడీపీ- వైసీపీ నేతల మధ్య మరోసారి వివాదం..!
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
‘మీ ఆమోదం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడు, ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక చారిత్రాత్మక చర్చకు వేదిక సృష్టించవచ్చు.” అని తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అభినవ్ ప్రకాష్ పాసి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా విద్యావంతుడని తన లేఖలో పేర్కొన్నారు. ఇంతలో, అభినవ్ ప్రకాష్ తనతో రాహుల్ గాంధీ చర్చకు సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నట్లు ఎక్స్లో రాశారు. అభినవ్ ప్రకాష్ తన X పోస్ట్లో, ‘నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తేజస్వి సూర్య. రాహుల్ గాంధీ నాతో చర్చకు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పాలన, ఉపాధి ఇలా అన్ని విషయాలపై బహిరంగ చర్చ జరగాలి.” అని రాసుకొచ్చారు.
Dear Rahul Gandhi Ji,
BJYM has deputed Sri @Abhina_Prakash, our VP, to debate with you.
He is a young and educated leader from the Pasi (SC) community, who are around 30%, in Rae Baraeli.
It will be an enriching debate between a political scion and a common youngster who… pic.twitter.com/8FarSmqrQe
— Tejasvi Surya (ಮೋದಿಯ ಪರಿವಾರ) (@Tejasvi_Surya) May 13, 2024
- Tags
- Abhinav Prakash
- bjp
- Bjym
- congress
- modi
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..