Brinda Karat: బీజేపీ ఊహలు గ్యాస్ బుడగల్లా ఉన్నాయి.. చివరకు పేలిపోక తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఎం జాతీయ నాయకురాలు బృంధాకారత్ బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఊహలు గ్యాస్ బుడగ లాగా ఉన్నాయని.. ఎంతో ఎత్తుకు ఎగిరి గ్యాస్ బుడగ చివరకు పేలిపోతుందని సీపీఎం జాతీయ నేత బృంధాకారత్ అన్నారు. శ్రీకాకులంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరిస్థితి గ్యాస్ బుడగ వలే ఉందన్నారు. మోడీ కలలు కలలయ్యాయని.. గ్యాస్ బుడగ వలె పేలిపోయాయని.. భారతదేశ ఓటర్లు మోడీ కలలు కలలుగానే మిగిల్చారని విమర్శించారు. బీజేపీ నేతలు అంతా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారన్నారు. భారతదేశ ప్రధాని అయిన మోడీ మైనార్టీలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందన్నారు. భారతదేశ ప్రధానులలో ఇంత దారుణంగా ఏ ప్రధాని ఇంతవరకు మాట్లాడలేదన్నారు.
READ MORE: Lok Sabha Elections 2024: పోలింగ్ సరళిని పరిశీలించేందుకు 23 దేశాల నుండి 75 మంది ప్రతినిధులు..
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
భారత ప్రధాని మీద ఢిల్లీలో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ కమిషనర్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రతి పౌరుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీ, బీజేపీతో చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు నోటికి ఫెవికాల్ రాసుకొని వెళ్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కోసం ఢిల్లీలో ఒక మాట కూడా మాట్లాడ లేదన్నారు. భారతదేశం మొత్తం మీద బీజేపీ టైర్ పంచర్ అయిపోయిందని.. పంచరైన టైరు తో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీపార్టీ చంద్రబాబు నాయుడు బీజేపీకి స్టెప్నీలా పనిచేస్తున్నారని విమర్శించారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ తో కలసి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!