Rajnath Singh: పదేళ్ల తర్వాత ఆ పార్టీ ఉండదు.. కాంగ్రెస్ పై రక్షణ శాఖ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని.. ఎపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. “ఎపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహ రావు కి సైతం భారత రత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం. పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకి కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే. మన దేశంలో మోడీ విశ్వ గురుగా అవతరించి దేశాన్ని పాలిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. అత్యధిక పార్లమెంట్ సీట్లను ఎన్డీయే కూటమి సాధిస్తుంది అన్న విశ్వాసం ఉంది. ప్రపంచం స్వాగతిస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.2014 ఎన్డీయే లేక ముందు భారత్ 11 వ స్థానంలో ఉండేది. నేడు ప్రపంచంలో మూడో స్థానానికి చేరడంతో మోడీ కృషి ఎనలేనిది
READ MORE: Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్
Also Read
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ” కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం అందిస్తుంది. పేదల వైద్యం కోసం 75 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క మంత్రిపై అవినీతి ఆరోపణలు గడిచిన పడేళ్లలో బీజేపీ మంత్రుల్లో ఏ ఒక్కరిపై ఆరోపణలు లేవు అదే మా నినాదం. ఒకే దేశం ఒకే జెండా అనేది మా నినాదం. జమ్మూకాశ్మీర్ సాధించడం మా ప్రభుత్వం తో నే సాధ్యంఅయోధ్య రామ మందిరం హిందువుల ఐదు వందలెల్ల కల. రామ రాజ్యాన్నీ సాధించిన వ్యక్తి మోడీ. కుల మతాల అతీతమైన పార్టీ బీజేపీ. త్రిబుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనారిటీ నారీ మణులకు గొప్ప వరం. 58 వేల కోట్లతో దేశంలో నేషనల్ హై వే రోడ్లు వేశాం. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండని కోరారు.”
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!