Etela Rajender: బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టుకి స్టేట్ ఫెస్టివల్ హోదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender on Budget: కులాలకు అతీతంగా పెద్దగట్టులోని లింగమంతుల స్వామిని కొలుస్తున్నారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ తరపున మొక్కులు చెల్లించుకున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టు జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తమ మొక్కులు ఫలించి బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు.
2.95 లక్షల బడ్జెట్ ప్రకటించినా ప్రజల్లో సంతృప్తి లేదని ఈటల వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన విమర్శించారు. ఉద్యోగులు రిటైర్ అయితే జీపీఎఫ్ ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ సర్కారు ఉందని ఆరోపించారు. సర్కారుని నమ్మి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. జీతాలు సమయానికి రాక బ్యాంకు ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులపై ఎగవేతదారులుగా ముద్రపడుతోందన్నారు. రైతులకు రుణాల మాఫీ లేదన్న ఆయన.. గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్ అంతా గంభీరాలు డాంబికాలేనని విమర్శలు గుప్పించారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Revanth Reddy: జీరో బడ్జెట్.. భూప్రపంచంలో ఇలాంటి బడ్జెట్ ఎవరూ ప్రవేశపెట్టలేదు..
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోతుందని అన్నారు. పరిపాలించే సత్తాలేని వారే ముందస్తుగా రాజీనామా చేస్తారని ఆయన పేర్కొ్న్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజలను బాధలు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్కి దగ్గరగా.. ప్రజలకు దూరంగా ఉంటారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో రాచరిక పరిపాలన సాగిస్తున్న కేసీఆర్.. ఇక్కడ పరిపాలించే సత్తా లేని మీరు దేశ పర్యటనలు చేసి ఏం సందేశం ఇస్తారని ఈటల రాజేందర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!