BJP: ఎన్నికల వేళ షాక్.. పోటీ నుంచి వైదొలిగిన అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వేళ ఎవరైనా టికెట్లు రాకపోతే నానా యాగీ చేస్తారు… కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసి భారీ హంగామా సృష్టిస్తారు. కానీ గుజరాత్ బీజేపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టికెట్లు లభించాక.. పోటీ నుంచి వైదొలిగి పార్టీకి ఝలక్ ఇచ్చారు.
గుజరాత్కు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు అధిష్టానం టికెట్లు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు నేతలు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాము పోటీకి దూరమవుతున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వడోదర సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్కు బీజేపీ మరోసారి టికెట్ ఇచ్చింది. అలాగే సబర్కాంతా నుంచి భికాజీ ఠాకూర్కు టికెట్ ప్రకటించింది. ఇటీవలే వారి పేర్లను అధికారికంగా పార్టీ అధిష్టానం వెల్లడించింది. కానీ వారు మాత్రం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుని హైకమాండ్కు షాకిచ్చారు.
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు

వడోదరలో రంజన్ భట్కు మరోసారి టికెట్ ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకు నిరసనగా నియోజకవర్గంలో బ్యానర్లు వెలిశాయి. 2014లో మోడీ.. వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వారణాసి నుంచి కొనసాగాలని నిర్ణయించుకోవడంతో వడోదర ఖాళీ అయింది. అప్పుడు అక్కడ నిర్వహించిన ఉప ఎన్నికలో రంజన్ భట్ విజయం సాధించారు. 2019లో కూడా ఈ విజయం రిపీట్ అయింది. మరోసారి 2024 ఎన్నికల్లో కూడా వడోదర టికెట్ భట్కే కేటాయించారు. కానీ ఆమె మాత్రం పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే సబర్కాంతా నుంచి బరిలోకి దిగిన భికాజీ ఠాకూర్ కూడా వైదొలిగారు. వ్యక్తిగత కారణంతోనే అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు ఒకే దశలో మే 7న పోలింగ్ జరగనుంది. గత రెండుసార్లు అన్ని సీట్లు కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మరోసారి అన్ని సీట్లు ఖాతాలో వేసుకోవాలని పువ్వు పార్టీ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Chris Gayle: ధోనీ కొన్ని మ్యాచ్లు ఆడరు..
ఇదిలా ఉంటే కర్ణాటకలో మాత్రం టికెట్లు రాక.. సీనియర్ నేతలు అలక బూనారు. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ్కు ఈసారి టికెట్ లభించలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ గుజరాత్లో మాత్రం టికెట్లు లభించాక పోటీ నుంచి తప్పుకోవడం విశేషం.
#WATCH | Vadodara, Gujarat: On the decision to withdraw her candidacy for the upcoming general elections, Vadodara BJP MP Ranjan Bhatt says, "…I felt that I don't want to fight, so I made up my mind and wrote it on social media…Some people say bad things about Vadodara, so I… pic.twitter.com/qF76l6guWw
— ANI (@ANI) March 23, 2024
తాజావార్తలు
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!