Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana Assembly Elections 2023 Bjp Senior Leader Laxman Comments On Brs And Congress

Laxman: సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుతున్నాం

Published Date :November 8, 2023 , 9:06 pm
By Mahesh Jakki
Laxman: సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుతున్నాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Laxman: బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో పలువురు చేరారు. కొల్లాపూర్ నుంచి బీసీ నాయకుడు, సంఘ సేవకుడు సింగోట రామన్న బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి ఆయనను లక్ష్మణ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు కోరుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. గతంలో మోడీ ప్రధాని అభ్యర్థిగా వస్తే తెలంగాణ ప్రజలు నిండైన మనసుతో ఆశీర్వదించడంతో ప్రధాని అయ్యారని.. పదేండ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తూ ఓటేస్తే బీసీ సీఎం అవుతారని మోడీ చెప్పారని లక్ష్మణ్ వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుతున్నామని ఆయన అన్నారు. బీసీలందరూ ఒక్కటయ్యారన్న ఆయన.. వార్ వన్ సైడ్ అయ్యిందన్నారు. సామాజిక న్యాయం ఎన్టీఆర్‌ తర్వాత ఇప్పుడు బీజేపీ మాత్రమే చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ అని, కాంగ్రెస్ దేశంలో ఒక కుటుంబం కోసం పని చేసే పార్టీ అంటూ ఆయన విమర్శించారు.

Also Read: Pawan Kalyan: బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలి

Also Read

  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
  • Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
  • Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..

పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని అయితే.. రాహుల్, ఆయన కుటుంబం ఎంతగా హేళన చేస్తున్నారో తెలుసన్నారు. ప్రజలు ఓడించినా ఇంకా కాంగ్రెస్‌కు బుద్ది రాలేదన్నారు. రాహుల్ బీసీ సమాజాన్ని హేళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా గెలవలేని పార్టీ కాంగ్రెస్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీసీ సీఎం అని ప్రకటిస్తే 2 శాతం ఓట్లు వస్తాయని రాహుల్ బీసీలను హేళన చేస్తున్నాడన్నారు. అన్ని సమీకరణలు తీసుకుని 35 సీట్లు 100 సీట్లలో బీసీలకు ఇచ్చామన్నారు. బీసీ సంఘాలు ప్రధాని మోడీని కలిసి ముచ్చటించటం మా అదృష్టం అని బీసీ కుల సంఘాల అధ్యక్షులు చెప్పారని ఈ సందర్భంగా లక్ష్మణ్ చెప్పారు. మీ పీఠాలు, గడీల రాజ్యం బద్దలు కొట్టడానికి ఏకం అవుతున్నారన్నారు. బీసీలనే కాదు అన్ని వర్గాలను కేసీఆర్ వంచించారని ఆయన ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇస్తే కూడా కేసీఆర్ తట్టుకోలేదని ఆయన అన్నారు.

Also Read: Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్‌కళ్యాణ్

కాంగ్రెస్, కేసీఆర్‌ను ఎవరినీ నమ్మినా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలని కోరుతున్నానని ఆయన సూచించారు. అమ్మలాంటి తెలంగాణను కేసీఆర్ అమ్మకానికి పెడుతున్నారు.. అమ్మలాంటి దేశంను కాంగ్రెస్ అమ్మకోవాలని చూసిందని ఆయన ఆరోపించారు. నీ కుటుంబం తప్ప మరొకటి లేదు కేసీఆర్.. వందల వేల కోట్లకు కేసీఆర్ కుటుంబం పడగలెత్తిందన్నారు. ప్రవళిక లాంటి వాళ్ల ఉసురు ఊరికే పోదన్నారు.పసుపు బోర్డు మాట ఇచ్చిన తెచ్చిన వ్యక్తి అర్వింద్‌ అని, బీజేపీ అని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు కవితమ్మ అని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్, మజ్లీస్ ఆర్డర్ మీద పనిచేసే పార్టీలు అంటూ ఆరోపించారు. బీసీ సీఎం అయ్యే చారిత్రాత్మకమైన నిర్ణయంలో తెలంగాణ ప్రజలు ఓటేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • congress
  • laxman
  • Telangana Assembly Elections

తాజావార్తలు

  • Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!

  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..

  • Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..

  • Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions