Vishnu Kumar Raju: వైసీపీకి 17 సీట్లు కూడా రావు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Kumar Raju: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. జగన్ ఓటర్ గుర్తింపు కార్డులను మార్ఫింగ్ చేయడం తిరుపతిలో ఉప ఎన్నికలు నుంచి ప్రారంభించారు. 30 వేలు దొంగ ఓట్లు వేయించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40 వేలు దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి 20 వేలు దొంగ ఓట్లు తొలగించారని సమాచారం ఉందన్నారు. అసలు వైసీపీకి 175 కాదు.. 17 సీట్లు కూడా రావు.. జగన్ కు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి.? రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకా? అని ప్రశ్నించారు.
Read Also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పీసీసీ గా రావడం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు విష్ణు కుమార్ రాజు.. దొంగ ఓట్లు, దోచుకున్న డబ్బు పంచి.. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ వైఎస్ జగన్, ఆయన అనుచరులు పై దాడులు చేయాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. మేం అధికారంలోకి రాగానే చీఫ్ లిక్కర్ తీసేసి నాణ్యమైన లిక్కర్ అందిస్తాం అని ప్రకటించారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపానం చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారు.. జగన్ కుటుంబాలలో కలహాలు పెడుతున్నారు అని మండిపడ్డారు.
Read Also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు
ఇక, బొత్స ఝాన్సీ.. విశాఖలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదన్నారు విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు వింతపనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి కనుమ కానుకగా నాసిరకం మద్యం, కోడి పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని ఎన్నికల సభలు పెట్టిన శుద్ధ దండగ. జగన్ ఒక్క సీటుకి 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. జగన్ ఇక నీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. మీరు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచే పరిస్థితి ఇక లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా ఎంక్వయిరీ చేస్తున్నారు. వైసీపీ నామ రూపాలు లేకుండా పోయే పరిస్ఠితి వస్తుందన్నారు. మరోవైపు, సెంట్రల్ గర్నమెంట్ అన్ని కేంద్ర సంస్థలకి ఈ నెల 22 తేదీన హాఫ్ డే సెలవు ప్రకటించింది. మన రాష్ట్రంలో ఆ రోజు సెలవు ప్రకటించక పోవడం చాలా దురదృష్టకరం అన్నారు. స్కూల్స్ కి 21 వరకు సెలవు ప్రకటించి, 22 తేదీన హిందువుల కోసం సెలవు ప్రకటించలేరా ? అని నిలదీశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!