Vishnu Kumar Raju: వైసీపీకి 17 సీట్లు కూడా రావు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండాలి..!
Vishnu Kumar Raju: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ రెండు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. జగన్ ఓటర్ గుర్తింపు కార్డులను మార్ఫింగ్ చేయడం తిరుపతిలో ఉప ఎన్నికలు నుంచి ప్రారంభించారు. 30 వేలు దొంగ ఓట్లు వేయించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40 వేలు దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి 20 వేలు దొంగ ఓట్లు తొలగించారని సమాచారం ఉందన్నారు. అసలు వైసీపీకి 175 కాదు.. 17 సీట్లు కూడా రావు.. జగన్ కు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి.? రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకా? అని ప్రశ్నించారు.
Read Also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు
Also Read
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పీసీసీ గా రావడం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు విష్ణు కుమార్ రాజు.. దొంగ ఓట్లు, దోచుకున్న డబ్బు పంచి.. జగన్ మళ్లీ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ వైఎస్ జగన్, ఆయన అనుచరులు పై దాడులు చేయాలని సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. మేం అధికారంలోకి రాగానే చీఫ్ లిక్కర్ తీసేసి నాణ్యమైన లిక్కర్ అందిస్తాం అని ప్రకటించారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపానం చేస్తామని చెప్పిన జగన్ మాట తప్పారు.. జగన్ కుటుంబాలలో కలహాలు పెడుతున్నారు అని మండిపడ్డారు.
Read Also: KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు
ఇక, బొత్స ఝాన్సీ.. విశాఖలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదన్నారు విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు వింతపనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి కనుమ కానుకగా నాసిరకం మద్యం, కోడి పంపిణీ చేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్ని ఎన్నికల సభలు పెట్టిన శుద్ధ దండగ. జగన్ ఒక్క సీటుకి 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.. జగన్ ఇక నీ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. మీరు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచే పరిస్థితి ఇక లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా ఎంక్వయిరీ చేస్తున్నారు. వైసీపీ నామ రూపాలు లేకుండా పోయే పరిస్ఠితి వస్తుందన్నారు. మరోవైపు, సెంట్రల్ గర్నమెంట్ అన్ని కేంద్ర సంస్థలకి ఈ నెల 22 తేదీన హాఫ్ డే సెలవు ప్రకటించింది. మన రాష్ట్రంలో ఆ రోజు సెలవు ప్రకటించక పోవడం చాలా దురదృష్టకరం అన్నారు. స్కూల్స్ కి 21 వరకు సెలవు ప్రకటించి, 22 తేదీన హిందువుల కోసం సెలవు ప్రకటించలేరా ? అని నిలదీశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు.
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?