KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు.. మొత్తం 420 హామీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు. తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారి చేశారని అన్నారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైందన్నారు. నోటికి ఎంత వస్తె అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టమని కేటీఆర్ అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు.
Read also: Bhanu Prakash Reddy: వైనాట్ 175 అంటే దొంగ ఓట్ల దందానేనా..? సీబీఐ విచారణకు సిద్ధమా..?
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతుందన్నారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు హైదరాబాద్లో కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు సృష్టించి బంగారు తెలంగాణను కాంగ్రెస్కు అప్పగించినా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఇక నుంచి కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ గెలవడం కష్టం కాదని కేటీఆర్ అన్నారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..