Sunil Deodhar: వైసీపీ సర్కార్ అన్నిటా విఫలం..ప్రతి గ్రామంలో పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అధికార వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు బీజేపీ నేతలు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కీలక నేతలు పాల్గొన్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో వున్న రెండు కుటుంబ పార్టీలను ఓడించడానికి బీజేపీ కృషి చేస్తుంది, జనసేన బీజేపీతోనే వుంది..ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయింది..చంద్రబాబు పాలన నుంచి జగన్ పాలనలో వరకు చూస్తుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ప్రజల పరిస్థితి మారిందన్నారు.

Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
Read Also: Jandhyala RaviShankar: జీవో 1పై మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం
అన్ని వనరులను దోచుకోవడం, హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా వైసీపీ మారింది.. హుండీ ఆదాయం ఇతర మతాలకు పంచి పెడుతున్నారు..పోరు యాత్ర-2 పేరుతో ప్రతి గ్రామంలో రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టానికి కృషిచేస్తాం అన్నారు సునీల్ దియోధర్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల పాలుకావడం, ఉద్యోగులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లో వైసీపీ ప్రభుత్వం వుంది..బీజేపీపై మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తూ టిడిపి,బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి..వేల కోట్ల అవినీతికి పాల్పడిన వైసీపీ,టిడిపి వాళ్ళని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం బిజెపికి లేదన్నారు.
బీజేపీ MLC మాధవ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు జీతాలు రాలేదని గవర్నర్ ను వారు కలవడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు తననానికి నిదర్శనం అన్నారు. అన్ని వ్యవస్థలు తమ చేతుల్లో తీసుకుని ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది..వైసీపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం అన్నారు.
Read Also: Jandhyala RaviShankar: జీవో 1పై మంచి తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!