BJP leader Parthasarathi: విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు.. అధికారంలోకి రాగానే మాట తప్పాడు..
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యదర్శి పార్థసారథి అన్నారు. కానీ అధికారంలోకి రాగానే మాటతప్పాడు అంటూ విమర్శలు గుప్పించారు. గత నాలుగున్నర సంవత్సరాలలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని ఆయన ఆరోపణలు చేశారు. జగన్ ఎన్నికలకు ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట చెప్పి ప్రజలను మోసగించాడు అని బీజేపీ నేత డా.పార్థసారథి అన్నారు.
Read Also: Rahul Gandhi: “అమిత్ షాకి చరిత్ర తిరగరాసే అలవాటు ఉంది”.. నెహ్రూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ..
విద్యుత్ సంస్ధల ఒప్పందంలో తెలుగు దేశం పార్టీ అవినీతికి పాల్పడిందని చెప్పి.. అవే సంస్ధలతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం ఎలా చేసుకుందని బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి ప్రశ్నించారు. కరెంట్ దోపిడీకి అవినీతి ప్రోత్సహించే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అని ఆయన మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో ఏపీలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్ఫ్లిక్స్లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
-
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
-
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్గా కుదరాలా.. అయితే సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!