Laxman: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laxman: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు తడబడుతున్నారని.. వందరోజుల మా పాలనను రెఫరెండంగా భావించి మాకు ఓటు వేయాలని అన్నారని.. ఇప్పుడు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలపై వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తోందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని గ్యారెంటీలు నెరవేరుతాయని చెబుతున్నారని.. ఈ మాటలు వింటుంటే బోడగుండుకు మోకాలుకు ముడి పెట్టినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
Read Also: Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతోందని మాట్లాడుతున్నాడని.. సానుభూతి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కూడా ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనందున ఒవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ సిద్ధం అయిందని ఆయన ఆరోపించారు.ఇది స్వయంగా ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాటల్లోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తరుపున తాను మాట్లాడుతుంటే తమ పార్టీకి నచ్చడం లేదని అంటున్నారని.. కానీ ఆ మాటలపై రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో మెసలడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రత్యర్థులకు తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్య ఎంఐఎం సంధి చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీని గెలవలేకే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో సారి మోడీనే ప్రధానిగా ఎన్నికోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలీ పోవాలని తాము కోరుకోవడం లేదని.. ఈ ఐదేళ్లు కాంగ్రెస్ మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు. హామీల అమలు విషయంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందన్నారు. అబద్ధాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని.. అహంకారానికి నిర్వచనం బీఆర్ఎస్ పార్టీ అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!