Laxman: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laxman: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు తడబడుతున్నారని.. వందరోజుల మా పాలనను రెఫరెండంగా భావించి మాకు ఓటు వేయాలని అన్నారని.. ఇప్పుడు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలపై వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తోందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని గ్యారెంటీలు నెరవేరుతాయని చెబుతున్నారని.. ఈ మాటలు వింటుంటే బోడగుండుకు మోకాలుకు ముడి పెట్టినట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.
Read Also: Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతోందని మాట్లాడుతున్నాడని.. సానుభూతి పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. మా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కూడా ముచ్చెమటలు పట్టిస్తోందన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనందున ఒవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ సిద్ధం అయిందని ఆయన ఆరోపించారు.ఇది స్వయంగా ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మాటల్లోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తరుపున తాను మాట్లాడుతుంటే తమ పార్టీకి నచ్చడం లేదని అంటున్నారని.. కానీ ఆ మాటలపై రేవంత్ రెడ్డి స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో మెసలడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. ప్రత్యర్థులకు తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్య ఎంఐఎం సంధి చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీని గెలవలేకే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో సారి మోడీనే ప్రధానిగా ఎన్నికోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలీ పోవాలని తాము కోరుకోవడం లేదని.. ఈ ఐదేళ్లు కాంగ్రెస్ మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు. హామీల అమలు విషయంలో బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందన్నారు. అబద్ధాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని.. అహంకారానికి నిర్వచనం బీఆర్ఎస్ పార్టీ అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!