Tamil Nadu: బీజేపీ నేత కుటుంబం దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP leader Family Killed in Tamilnadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత కుటుంబాన్ని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూరులో జరిగింది. హత్య కాబడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సెంథిల్ అనే 47 ఏళ్ల వ్యక్తి పల్లాడం దగ్గరలోని కళ్లికనారు వద్ద హోల్ సేల్ రైస్ షాపును నడుపుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొంతమంది వారి స్థలం వద్ద మద్యం తాగారు. వారి స్థలంలో మద్యం తాగొద్దని సెంథిల్ చెప్పడంతో వారు అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. సెంథిల్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆయనను కాపాడటానికి పరుగు పరుగున వచ్చారు. అయితే వారిపై కూడా దుండగలు దాడి చేశారు.
Also Read: Vivek Ramaswamy: ట్రంప్కు క్షమాభిక్ష ప్రసాదిస్తా.. వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
- Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
ఈ ఘటనలో సెంథిల్ తో పాటు ఆయన సోదరుడు మోహన్ రాజ్, వారి తల్లి, అత్తయ్య కూడా ఉన్నారు. సెంథిల్ సోదరుడు మోహన్ రాజ్ బీజేపీ కార్యకర్త. ఆయన పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మొన్నిమధ్యే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వచ్చినప్పుడు కూడా ఆయన జనాలను పోగేసి సభ ఏర్పాటు చేశారు. అయితే దుండగులు చేసిన దాడిలో నలుగురు కుటుంబ సభ్యులు మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ హత్యలకు కారణం కేవలం మద్యం మత్తులో ఉన్న వారితో గొడవేనా లేక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనే కోణం పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా వుండగా నిందితులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ వన్ సీఎం అని చెప్పుకునే స్టాలిన్ రాష్ట్రంలో ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. చనిపోయిన మోహన్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
-
Shreyas Iyer: వాంఖడే స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. మొదటి విజయం నమోదు..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!