MP K. Laxman : ప్రజలను మోసం చేయడానికి అమలుకు నోచుకోని హామీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. మా పథకాలనే కాఫీ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్పై మండిపడుతుంటే.. అమలు చేయలేని హామీలు మేనిఫెస్టోల పెట్టారని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికి అమలుకు నోచుకోని హామీలని వ్యాఖ్యానించారు. నమ్మించండం వంచించడం కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుందని, 2014, 2018 హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Jana Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తాం..
Also Read
- Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
- Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
- Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
అంతేకాకుండా.. ఆసరా ఏమైంది? 5 లక్షలు గృహలక్ష్మి ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. దివ్యాంగులకి ఏమి ఒరగబెట్టారని ఆయన మండిపడ్డారు. మోడీ పార్లమెంట్ లో చట్టం తెచ్చారు, యాసిడ్ దాడి బాధితుల ను కూడ చేర్చారని, దళిత బంధు చివరికి ఎంత మందికి ఇచ్చారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ లేక రైతులు ఇబ్బంది పడ్డారు, వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్య లు చేసుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. మహిళా సంఘాల డబ్బులు దోచుకున్న మీకు వాళ్ళ ఉసురు తాకుతుందని, మహిళలకు రిజర్వేషన్ ఇస్తే కవిత లిక్కర్ కేసు లో విచారణ కు వెళ్లారని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క మహిళా ఓబీసీకి టికెట్ ఇవ్వలేదని, దళిత సీఎం, మూడెకరాల మొదలు వాళ్ళను మోసం చేసినవ్ అంటూ కేసీఆర్పై నిప్పలు చెరిగారు లక్ష్మణ్. బీసీ సబ్ ప్లాన్ చట్టం అని అన్నవ్ ఏమైందని, అది నోరా మోరా? అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ అని, ఒక్క రేషన్ కార్డుకే దిక్కు లేదు.. దేశం రేషన్ కార్డు కూడా ఇవ్వలేని రాష్ట్రం ఇది అని ఆయన అన్నారు. ఎంబిసి కార్పొరేషన్ ఏమైంది? ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఊరికొకటి అయినా ఇచ్చవా? అని ఆయన అన్నారు. యువత కాచుకుని కూర్చుంది మీ సర్కారును కూల్చడానికి అని, మీ రంగుల సినిమాలు చూసి ప్రజలు మోసపోరన్నారు.
తాజావార్తలు
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!