Konda Vishweshwar Reddy: దేశంలోని కోట్లాది యువత మోడీకి అండగా నిలిచారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులంతా నరేంద్ర మోడీకి అండగా నిలిచారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లోని వైఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ, యువకులకు ఉపాధి మార్గాలు చూపిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల యువతకు మార్గనిర్దేశం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.
Read Also: Earthquake: జపాన్లో 6.5 తీవ్రతతో భూకంపం
Also Read
- Vaibhav Sooryavanshi: 'మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను'.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
- Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- Shreyas Iyer: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సర్కారును ఆ బాసు పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు. దేశంలో ముస్లిం మైనారిటీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీ కి దక్కుతుందన్నారు. నరేంద్ర మోడీకి పోటీగా నిలబడ లేకనే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ కు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగా 400 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అభ్యర్థులు 12 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తన వెంట నాలుగు లక్షల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయని సంబరపడుతున్నాడు.. కానీ, ఆయనకు యువకులంతా తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Also: Ramam Raghavam: ధనరాజ్ డైరెక్టర్గా “రామం రాఘవం”.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్
అలాగే, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హోటల్ దస్ పల్లలో బీజేపీ నిర్వహించిన సమావేశంలో కొండా సంగీతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడన్నారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతునిస్తున్నారని ఆమె చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలంతా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటే ఉంటారని ఆయన సతీమణి తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికలో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్త్ కోసం నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని కొండా సంగీతా రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Snapchat Love Story: స్నాప్చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
-
Varanasi: బర్త్డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
-
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!