BJP: బీజేపీ బ్యాక్ టూ బ్యాక్ సమావేశాలు.. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. వరసగా ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. 543 ఎంపీ స్థానాల్లో ఈ సారి బీజేపీ సొంతగా 375 సీట్లను గెలుచుకోవాలని, ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. దీని కోసం వ్యూహాలను రచిస్తోంది. వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో తొలి జాబితానను విడుదల చేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉండబోతున్నట్లు సమాచారం.
Read Also: Fuel prices: త్వరలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం.. హింట్ ఇచ్చిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి..
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
మరోవైపు పార్లమెంట్కి ఎక్కువ మంది ఎంపీలను పంపే ఉత్తర్ ప్రదేశ్తో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై ఈ రోజు బీజేపీ సమావేశాలు నిర్వహించింది. శనివారం ఉత్తర్ ప్రదేశ్పై జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య మరియు బ్రజేష్ పాఠక్ మరియు మంత్రి ధరంపాల్ సింగ్ హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో బీజేపీ 62 సీట్లను గెలుచుకుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ ఇంఛార్జులు తరుణ్ చుగ్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్తో పాటు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!