BJP vs Shiv Sena: మహారాష్ట్రలో బీజేపీ- శివసేన మధ్య సీట్ల పంచాయితీ.. ఇంకా కుదరని లెక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(శిండే)ల మధ్య సీట్ల పంపకాలపై పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు టాక్. ఇరు వర్గాలు నాయకులు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం కొనసాగుతుంది. దీంతో బీజేపీ, షిండే వర్గాలకి చెందిన శివసేన నాయకులు ఆందోళన పడుతున్నారు. సీట్ల పంపకంపై ఇరుపార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాలకు గాను బీజేపీ 29, శివసేన 13, ఎన్సీపీ(అజిత్ పవార్) 6 స్థానాల్లో బరిలోకి దిగుతాయని భావించాయి. అయితే, షిండే వర్గం 22 సీట్లు కావాలని డిమాండ్ చేశారు. కానీ, చర్చల తర్వాత ఈ ప్రతిపాదనకు ఏక్ నాథ్ షిండే ఒప్పుకున్నారని బీజేపీ నేతలు తెలిపారు. అయితే, ఇప్పటికీ ఫైనల్ లిస్టు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Sanjay Singh : సంజయ్ సింగ్ పాస్పోర్ట్ జప్తు .. కోర్టు షరతులు ఇవే?
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ఇక, 2014, 2019 ఎన్నికల్లో శివసేన పోటీ చేసి గెలిచిన కళ్యాణ్, థానే, నాసిక్, సిందుదుర్గ్, రత్నగిరి సీట్లపై బీజేపీ కన్నేసినట్లుంది. అయితే, ఈ సారి పలు సర్వేలు అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ రెడీ అవ్వగా అందుకు సీఎం షిండే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కళ్యాణ్ స్థానం నుంచి ప్రస్తుతం షిండే కుమారుడు శ్రీకాంత్ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో బీజేపీ ప్రతిపాదనకు అంగీకరిస్తే శివసేన నాయకులకు తప్పుడు సంకేతం వెళ్తుండటంతో ఈ సీట్లపై ఏక్ నాథ్ షిండే పట్టువీడటం లేదని టాక్. దీంతో ఈ సీట్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: AP Pension: సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!
అయితే, సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, శివసేన (షిండే)ల మధ్య వాగ్వాదంతో ఏక్ నాథ్ షిండే వర్గంలోని సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. కానీ, అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఇంకా సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవడంతో షిండే వర్గంలోని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. కాగా, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ పరిణామాలపై శివసేన( ఉద్దవ్ వర్గం) నాయకుడు రావుసాహెబ్ స్పందించారు. ఉద్ధవ్ థాక్రే బీజేపీతో సరైన విధంగా వ్యవహరించాడు.. కానీ ఏక్ నాథ్ షిండే ఫెయిల్ అయ్యాడు అని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!