తెలంగాణలో ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు దశ(పది) అంశాలతో కార్యచరణ రూపొందించారు.
1. ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి
2. వెనుకబడిన వర్గాల సాధికారత – అందరికీ చట్టం సమానంగా వర్తింపు
3. కూడు-గూడు: ఆహార, నివాస భద్రత
4. రైతే రాజు – అన్నదాతకు అందలం
5. నారీశక్తి- మహిళల నేతృత్వంలో అభివృద్ధి
6. యువశక్తి- ఉపాధి
8. వైద్యశ్రీ నాణ్యమైన వైద్యసంరక్షణ
9. సంపూర్ణ వికాసం – పరిశ్రమలు, మౌలికవసతులు & ఇతర సౌకర్యాలు
10. వారసత్వం, సంస్కృతి & చరిత్ర