Delhi: కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ కౌంటర్
ఢిల్లీ కేంద్రంగా బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ లోటస్-2.0’ అంటూ ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
ఆప్కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలను రూ.25 కోట్లకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన ఆధారాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కానీ నోటీసు తీసుకునేందుకు సీఎం నిరాకరించారు.
Also Read
తాజాగా ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ సర్కార్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ ఎదుర్కోలేక కేజీవ్రాల్ తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన పెద్ద అతినీతిపరుడని ప్రజలకు అర్థమైందని చెప్పుకొచ్చారు. క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ఇచ్చిన నోటీసులను కూడా తీసుకునేందుకు ఆయన నిరాకరించారని.. విచారణ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారని షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ నుంచి కేజ్రీవాల్ డుమ్మాకొడుతున్నారు. ఇప్పటికే ఆయన ఐదుసార్లు తప్పించుకున్నారు. తాజాగా క్రైమ్ బ్యాంచ్ ఇచ్చిన నోటీసులను కూడా తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. బీజేపీ కావాలనే దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ-ఆప్ మధ్య నడుస్తున్న ఈ వార్ ముందు ముందు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Indraja Shankar: పెళ్లి పీటలు ఎక్కనున్న బిగిల్ గుండమ్మ.. డైరెక్టర్ ను ప్రేమించి.. ?
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!