Bhuvneshwar Kumar: చెలరేగిన భువీ.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్, 4 పరుగులు..
- టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం యూపీ టీ20 లీగ్లో పాల్గొంటున్నాడు.
- నాలుగు ఓవర్ల స్పెల్లో ఒక మెయిడిన్ తో సహా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
- నాలుగు ఓవర్ల స్పెల్లో 20 డాట్ బాల్స్ వేశాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar in UP T20 League: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం యూపీ టీ-20 లీగ్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ లీగ్ లో కాశీ రుద్రతో జరిగిన మ్యాచ్ లో యూపీ ఫాల్కన్స్ కు చెందిన భువనేశ్వర్ కుమార్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు ఓవర్ల స్పెల్లో ఒక మెయిడిన్ తో సహా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్ల స్పెల్లో 20 డాట్ బాల్స్ వేశాడు. అతని ప్రమాదకరమైన బౌలింగ్ కారణంగా, అతని జట్టు UP ఫాల్కన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాశీ రుద్ర జట్టు 20 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్ 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?
Also Read
- Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- 14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
- RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
- Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
ఈ మ్యాచ్ లో మొదటగా కాశీ రుద్ర జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ముందు కాశీ రుద్ర బ్యాట్స్మెన్ నిస్సహాయంగా కనిపించారు. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్, అభినందన్ సింగ్ (03/31), కిషన్ కుమార్ సింగ్ (03/11) వికెట్లు సాధించడంతో కాశీ రుద్ర జట్టు 20 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ప్రిన్స్ యాదవ్ 33 పరుగులు, ఘనశ్యామ్ ఉపాధ్యాయ్ 25 పరుగులు చేశారు. వీరుకాకుండా మరే ఇతర బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో సమర్థ్ సింగ్ 47 బంతుల్లో అజేయంగా 55 పరుగులు, విప్రజ్ నిగమ్ 21 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేయడంతో లక్నో ఫాల్కన్స్ 13.5 ఓవర్లలో విజయం సాధించింది.
Pigmentation: ఇలా చేస్తే మీ పిగ్మెంటేషన్ సమస్య తీరినట్లే..
ఇకపోతే భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా 2022లో న్యూజిలాండ్ తో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. యూపీ టీ20 లీగ్లో ఈ ఆటతీరుతో మళ్లీ టీమ్ ఇండియాకు తలుపు తట్టాడు. భువనేశ్వర్ కుమార్ భారత్ తరఫున 87 టీ20 మ్యాచ్లు ఆడాడు. అందులో 90 వికెట్లు పడగొట్టాడు.
- Tags
- bhuvneshwar kumar
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?