MP Komati Reddy: అక్కడి వరకు మెట్రోను పొడిగించండి.. కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మెట్రో పొడిగించాలని ఆయన కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్న విషయాలు: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్(అబ్దుల్లాపూర్మెట్) వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉంది.. అలాలగే హైదరాబాద్ నగరం అటు వైపు వేగంగా విస్తరిస్తోంది.. ఎంతోమంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారు. ప్రయాణికులకు చాలా కష్టంగా ఉంటోంది.. సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఆఫీస్ లకు వెళ్లేవారికి చాలా అసౌకర్యం కలుగుతోంది అని అన్నారు. ఈ లైన్ ను పొడిగించే యోచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడానికి ముందుకు రావడం లేదు అని వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ... 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
- Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
నగరంలో రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.. పైగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ మార్గంలోని జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా కేంద్రం మారుస్తోంది.. రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది.. అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్.. ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే ఛాన్స్ ఉంటుంది.. కాబట్టి మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉంది అని భువనగిరి ఎంపీ పేర్కొన్నారు.
Read Also: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!
ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర గృహనిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ పురికి గతంలో లేఖ రాశాను.. దీనిపై ఆయన స్పందించి రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వార్డ్ చేశారు అని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.. కేంద్రానికి నేను రాసిన లేఖను, రాష్ట్రప్రభుత్వానికి ఢిల్లీ నుంచి వచ్చిన లేఖను కూడా మీకు పంపుతున్నా.. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో