Bhumana Karunakar Reddy: చంద్రబాబు మాటలపై పవన్ సమాధానం చెప్పాలి.. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన ఫైర్..
- బాబు అబద్దాల మాటలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి..
- అబద్దాలు చెప్పినందున ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: సంక్షేమ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది.. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమన్న సీఎం.. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి.. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు.. అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు..? అని ఎద్దేవా చేశారు..
Read Also: Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వీటిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు..!
Also Read
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.. నీతిఅయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలేనని మోసం చేశారు అని మండిపడ్డారు భూమన.. అధికారంలోకి వస్తే 15 వేలు పిల్లలకు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చేబుతున్నారు అని దుయ్యబట్టారు.. ఎన్నికలలో ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంటో చంద్రబాబు, పవన్ కల్యాణ్కు తెలియదా? అని నిలదీశారు.. ఎన్నికల సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. వైఎస్ జగన్ కంటే ఎక్కవగా ఇస్తామని హామీ ఇచ్చారు… ఇప్పుడేమో చేతులేత్తేశారని విమర్శలు గుప్పించారు.. ఘోరమైన పాలన చంద్రబాబు చేస్తున్నాడు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని.. మళ్లీ అబద్దాలు చేబుతున్నాడు.. అబద్దాలు బుద్దుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..
Read Also: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు భూమన.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.. తల్లికి వందనం కాస్తా తల్లికి తద్దినంగా చేశాడు.. అన్నదాత సుఖీభవ కాస్తా అన్నదాత అప్పుభవా అయ్యింది. చంద్రబాబు అబద్దాల మాటలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. జగన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పరిపాలన చేశాడు.. కానీ, రాష్టాన్ని ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు అని ఆరోపించారు.. ఇచ్చిన హామీలు 98 శాతం జగన్ అమలు చేశారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి..
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!