Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
- హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు
- గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.
- బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ నిర్వహణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket Case: హైదరాబాద్ మహానగరంలోని అలకనంద హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకీ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు కేసుకు సంబంధించి కిడ్నీలు ఇచ్చినవారు, కిడ్నీలు తీసుకున్నవారు లభించగా హాస్పిటల్ ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగినా.. చివరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజా సమాచారం మేరకు గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
వైజాగ్ చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ ఈ కథ తిరుగుతోంది. ఇదివరకు కూడా రాజశేఖర్ వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కిడ్నీ రాకెట్ సంబంధించి డాక్టర్ రాజశేఖర్ హైదరాబాదులో మూడు ఆసుపత్రులను ఉపయోగించాడు. ఇందులో భాగంగా హైదరాబాదులోని జనని ఆసుపత్రిలో మొదట 60 కిడ్నీ ఆపరేషన్లు చేయగా.. ఆ విషయం కాస్త లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు. ఆ తర్వాత అవని హాస్పిటల్ లో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. ఆ ఆసుపత్రి తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లుగా సమాచారం. ఈ ఇల్లీగల్ పనిలో ముగ్గురు రోగులు కూడా మరణించారని తెలుస్తోంది. ఈ విషయం ఇల్లీగల్ కావడంతో ఈ విషయాన్ని రోగుల బంధువులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. ఈ ఆపరేషన్ కు 45 నుంచి 60 లక్షల వరకు సొమ్మును వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు. ఈ డాక్టర్లు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి దింపి కిడ్నీలను దోచేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!