Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
- హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు
- గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.
- బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ నిర్వహణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket Case: హైదరాబాద్ మహానగరంలోని అలకనంద హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకీ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు కేసుకు సంబంధించి కిడ్నీలు ఇచ్చినవారు, కిడ్నీలు తీసుకున్నవారు లభించగా హాస్పిటల్ ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగినా.. చివరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజా సమాచారం మేరకు గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
వైజాగ్ చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ ఈ కథ తిరుగుతోంది. ఇదివరకు కూడా రాజశేఖర్ వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కిడ్నీ రాకెట్ సంబంధించి డాక్టర్ రాజశేఖర్ హైదరాబాదులో మూడు ఆసుపత్రులను ఉపయోగించాడు. ఇందులో భాగంగా హైదరాబాదులోని జనని ఆసుపత్రిలో మొదట 60 కిడ్నీ ఆపరేషన్లు చేయగా.. ఆ విషయం కాస్త లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు. ఆ తర్వాత అవని హాస్పిటల్ లో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. ఆ ఆసుపత్రి తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లుగా సమాచారం. ఈ ఇల్లీగల్ పనిలో ముగ్గురు రోగులు కూడా మరణించారని తెలుస్తోంది. ఈ విషయం ఇల్లీగల్ కావడంతో ఈ విషయాన్ని రోగుల బంధువులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. ఈ ఆపరేషన్ కు 45 నుంచి 60 లక్షల వరకు సొమ్మును వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు. ఈ డాక్టర్లు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి దింపి కిడ్నీలను దోచేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!