Bhumana Karunakar Reddy: చంద్రబాబు మాటలపై పవన్ సమాధానం చెప్పాలి.. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన ఫైర్..
- బాబు అబద్దాల మాటలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి..
- అబద్దాలు చెప్పినందున ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: సంక్షేమ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది.. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమన్న సీఎం.. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి.. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు.. అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు..? అని ఎద్దేవా చేశారు..
Read Also: Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వీటిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.. నీతిఅయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలేనని మోసం చేశారు అని మండిపడ్డారు భూమన.. అధికారంలోకి వస్తే 15 వేలు పిల్లలకు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చేబుతున్నారు అని దుయ్యబట్టారు.. ఎన్నికలలో ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంటో చంద్రబాబు, పవన్ కల్యాణ్కు తెలియదా? అని నిలదీశారు.. ఎన్నికల సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. వైఎస్ జగన్ కంటే ఎక్కవగా ఇస్తామని హామీ ఇచ్చారు… ఇప్పుడేమో చేతులేత్తేశారని విమర్శలు గుప్పించారు.. ఘోరమైన పాలన చంద్రబాబు చేస్తున్నాడు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని.. మళ్లీ అబద్దాలు చేబుతున్నాడు.. అబద్దాలు బుద్దుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..
Read Also: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు భూమన.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.. తల్లికి వందనం కాస్తా తల్లికి తద్దినంగా చేశాడు.. అన్నదాత సుఖీభవ కాస్తా అన్నదాత అప్పుభవా అయ్యింది. చంద్రబాబు అబద్దాల మాటలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. జగన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పరిపాలన చేశాడు.. కానీ, రాష్టాన్ని ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు అని ఆరోపించారు.. ఇచ్చిన హామీలు 98 శాతం జగన్ అమలు చేశారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!