Ahmedabad Plane Crash: ఆలస్యం, ప్రయాణ వాయిదా.. విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు!
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం
- విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం మధ్యాహ్నం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ171) కుప్పకూలడంతో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చగా.. ఇద్దరు మాత్రం తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
పది నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే యువతి ప్రాణాలను నిలబెట్టింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్లో ఓ సీటును భూమి చౌహాన్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో భూమి చౌహాన్ పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అయి.. కాసేపటికే కుప్పకూలింది. విషయం తెలిసిన ఆమె షాక్కు గురైంది. ‘విమాన ప్రమాదం గురించి తెలియగానే షాక్కు గురయ్యా. ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. నేను అస్సలు మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ గణపతి బప్పే నన్ను కాపాడాడు’ అని భూమి చౌహాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం ఇండియా వచ్చింది. తిరుగు ప్రయాణంకు టికెట్ బుక్ చేసుకోగా.. ఆలస్యం ఆమె ప్రాణాలను నిలబెట్టింది.
Also Read
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Also Read: AirIndia Plane Crash: కుటుంబం మొత్తాన్ని బలిగొన్న విమాన ప్రమాదం.. లండన్లో స్థిరపడాలని..!
గుజరాత్కు చెందిన 60 ఏళ్ల సవ్జీభాయ్ టింబడియాను అదృష్టం కాపాడింది. లండన్లో నివసిస్తున్న సవ్జీభాయ్ కుమారుడు ఇటీవల ఆయన కోసం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేశారు. ఎయిర్ ఇండియా సంస్థ ఆయనకు సీటు నంబరు కూడా కేటాయించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు రోజుల క్రితమే సవ్జీభాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అహ్మదాబాద్లో గురువారం విమానం ప్రమాదానికి గురి కాగా.. అదృష్టం కొద్ది ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ దేవుడి దయతోనే తాను ప్రాణాలతో బయపడ్డాడని సవ్జీభాయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?