Ahmedabad Plane Crash: ఆలస్యం, ప్రయాణ వాయిదా.. విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు!
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం
- విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు
గురువారం మధ్యాహ్నం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ171) కుప్పకూలడంతో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చగా.. ఇద్దరు మాత్రం తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
పది నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే యువతి ప్రాణాలను నిలబెట్టింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్లో ఓ సీటును భూమి చౌహాన్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో భూమి చౌహాన్ పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అయి.. కాసేపటికే కుప్పకూలింది. విషయం తెలిసిన ఆమె షాక్కు గురైంది. ‘విమాన ప్రమాదం గురించి తెలియగానే షాక్కు గురయ్యా. ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. నేను అస్సలు మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ గణపతి బప్పే నన్ను కాపాడాడు’ అని భూమి చౌహాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం ఇండియా వచ్చింది. తిరుగు ప్రయాణంకు టికెట్ బుక్ చేసుకోగా.. ఆలస్యం ఆమె ప్రాణాలను నిలబెట్టింది.
Also Read
- Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్.. దిల్ రాజు ప్లానింగ్ మాములుగా లేదు గా..!
- Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
- Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
- Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
Also Read: AirIndia Plane Crash: కుటుంబం మొత్తాన్ని బలిగొన్న విమాన ప్రమాదం.. లండన్లో స్థిరపడాలని..!
గుజరాత్కు చెందిన 60 ఏళ్ల సవ్జీభాయ్ టింబడియాను అదృష్టం కాపాడింది. లండన్లో నివసిస్తున్న సవ్జీభాయ్ కుమారుడు ఇటీవల ఆయన కోసం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేశారు. ఎయిర్ ఇండియా సంస్థ ఆయనకు సీటు నంబరు కూడా కేటాయించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు రోజుల క్రితమే సవ్జీభాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అహ్మదాబాద్లో గురువారం విమానం ప్రమాదానికి గురి కాగా.. అదృష్టం కొద్ది ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ దేవుడి దయతోనే తాను ప్రాణాలతో బయపడ్డాడని సవ్జీభాయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్.. దిల్ రాజు ప్లానింగ్ మాములుగా లేదు గా..!
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?