Bhatti Vikramarka : జపాన్లో భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటన ప్రారంభం
- హానిడ విమానాశ్రయంలో స్వాగతం పలికిన భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు
- గ్రీన్ హైడ్రోజన్తో పాటు పలు వ్యాపార కంపెనీలతో జరగనున్న భేటీ
- తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానించ నున్న భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మూడు రోజుల పర్యటనకు జపాన్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు రాష్ట్ర బృందం లో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి ఎన్ .బలరామ్ ఈ పర్యటన లో పాల్గొంటున్నారు. పర్యావరణహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ సంబంధిత టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాల పరిశీలనకై ఈ బృందం జపాన్ లోని పలు ప్రముఖ పరిశ్రమలను సందర్శించడంతోపాటు వివిధ దిగ్గజ కంపెనీలతో సమావేశాలు నిర్వహించనున్నది. అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ దేశ ప్రముఖ కంపెనీల, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.
Team India: టీమిండియా రికార్డుల మోత.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సంచలనం
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
మూడు రోజుల పర్యటన లో సోమవారం భారత రాయబారి సిబి జార్జి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి కి జపాన్ దేశంలో గల పరిశ్రమలు, తెలంగాణలో పెట్టుబడులకు, భాగస్వామ్య పరిశ్రమలకు గల అవకాశాలపై సంక్షిప్తంగా వివరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌరవార్థం భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఇందులో భట్టి విక్రమార్క ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1వ తేదీ ఉదయం పెట్టుబడులతో వచ్చే కంపెనీల తో రౌండ్ టేబుల్ సమావేశం , వివిధ పారిశ్రామిక వేత్తల తో విడివిడిగా సమావేశాలు, అదే రోజు సాయంత్రం యమాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శన లో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు. 2 వ తేదీన తోషిబా, కవాసాకి ,యాక్లహామ పరిశ్రమలను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఒకాస చేరుకోని 3తేదీన పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్ సందర్శిస్తారు.అనంతరం నాలుగో తేదీన రాష్ట్ర బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది.
Vehicles Illegal Transportation : వాహనాల అక్రమ రవాణా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి…
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..