Bhadradri Incident : శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు.. భయంకర పరిస్థితులు
- శిధిలాల కింద చిక్కుకున్నవారు – భయంకర పరిస్థితుల
- విచారణలో ఉన్న జిల్లా కలెక్టర్ – సహాయ చర్యలు ముమ్మరం
- అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు – ప్రజల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadradri Incident : భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ ఘటన సమయంలో భవనంలో ఆరుగురు నుంచి ఏడుగురు వరకు ఉండే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు భద్రాచలం లంబాడీ కాలనీకి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ధృవీకరించారు. మిగిలిన వారిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భవనం పూర్తిగా శిధిలాలకుపోయిన కారణంగా, సహాయచర్యలు మెల్లగా కొనసాగుతున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
భద్రాచలం పట్టణంలో జరిగిన ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున సింగరేణి రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టింది. శిధిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన ఉప్పలయ్య తన కుటుంబాన్ని పోషించేందుకు కూలీగా పనిచేస్తూ, అదనపు 500 రూపాయలు ఇస్తామనే ఆశతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. “నా ఇద్దరు పిల్లలు చిన్నవాళ్లు, వాళ్లను ఎవరు చదివిస్తారు?” అంటూ ఆయన భార్య కన్నీరుమున్నీరవుతోంది.
ఈ భవనం విషయంలో 120కి పైగా ఫిర్యాదులు అందినా, అధికారులు కనీసం పరిశీలించకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. “ఈ భవనం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని మేము ఎప్పుడో ఫిర్యాదు చేశాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు” అని తెల్లం నరేష్ అనే వ్యక్తి ఆరోపించారు.
భద్రాచలం మునిసిపల్ పరిధిలో అనుమతుల్లేకుండా ఇలాంటి భారీ భవనాలు నిర్మించడాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలనే డిమాండ్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ ఘటన భద్రాచలంలో నిర్మాణ నిబంధనల పాటింపు, అధికారుల నిర్లక్ష్యం, భవనాల భద్రతా ప్రమాణాలు గురించి పెద్ద చర్చను తీసుకువచ్చింది.
Amazon: అమెజాన్ కు బిఐఎస్ షాక్.. వేర్హౌస్పై దాడులు.. 2783 ఉత్పత్తులు సీజ్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!