Crime News: ప్రేమ వద్దు అన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
- పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం
- ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లి హత్య
- మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు, యువతి మధ్య ప్రేమ వద్దని చెప్పినందుకు బాలిక తల్లిని హత్య చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడ్డ మైనర్ బాలిక.. మైనర్ అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. అబ్బాయి ఆ అమ్మాయితో కొన్ని రోజులుగా స్నేహం చేస్తుంది. కాగా.. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయట పడింది. తన కుమార్తె తన స్నేహితుడితో కలిసి తన భార్యను హత్య చేసిందని 14 ఏళ్ల బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: AP Home Minister: ఏపీలో పోలీసులకు వీక్ ఆఫ్లు.. కొనసాగుతున్న సన్నాహాలు..?
Also Read
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
కేసు పెడితే చంపేస్తామని మైనర్లిద్దరూ బెదిరించారని నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేశానని తండ్రి చెప్పాడు. సోషల్ మీడియాలో పరిచయమైన అబ్బాయితో తన కుమార్తెకు ఏడాదిన్నరగా సంబంధం ఉందని తండ్రి తెలిపాడు. అయితే, తల్లి తరచూ తన కూతురిని ఇదే విషయమై తిట్టేదని, ఆమె అతనితో స్నేహం వద్దు.. వదులోకోవాలని సూచించేది.. కానీ తన కూతురు అందుకు అంగీకరించలేదని చెప్పాడు.
Read Also: Charu Haasan: ఆసుపత్రిలో కమల్ సోదరుడు.. అసలు ఏమైందంటే?
దీంతో బాలిక తల్లిని హత్య చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక జూన్ 6వ తేదీ రాత్రి తన ప్రియుడిని తన ఇంటికి పిలిపించింది. బాలుడు ఆమె తల్లిని గొంతు నులిమి.. ఛాతీపై కొట్టి చంపాడు. శబ్దం విని మేల్కొన్న తండ్రి.. యువకుడు అతన్ని మంచం మీద నుండి తోసేశాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తన భార్య మరణాన్ని సహజ మరణమని పేర్కొంటూ మధ్యాహ్నం ఆమెను దహనం చేశాడని సదరు వ్యక్తి తెలిపాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు మైనర్లను అరెస్టు చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. దీంతో.. వారిద్దరూ నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!