Beer Bottle Christmas Tree: ఇదేందయ్యా ఇది.. ఖాళీ బీర్ బాటిళ్లతో క్రిస్మస్ ట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer Bottle Christmas Tree: కేరళలోని గురువాయర్ లో ఏర్పాటు చేసిన ఒక విచిత్రమైన క్రిస్మస్ ట్రీ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో.. పండుగ ఆనందం కంటే రాజకీయ రచ్చ ఎక్కువైంది. ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ విషయాన్ని లేవనెత్తగా.. వెంటనే యూడీఎఫ్ సభ్యులు జాయ్ చెరియన్, ఆంటో థామస్ కూడా స్పందించారు. ఖాళీ మద్యం సీసాలతో క్రిస్మస్ వేడుకలు జరపడం సరైన సందేశం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత్లో Poco కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్లు.. Poco M8, M8 Proపై భారీ అంచనాలు..!
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
కౌన్సిల్ హాలులో ఈ విషయమై పెద్ద రణరంగమే నడిచందంటే నమ్మండి. ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ కార్యదర్శిని వ్యక్తిగతంగా కలిసి నిరసన తెలిపారు. అయితే మున్సిపల్ కార్యదర్శి స్పందిస్తూ.. ఈ క్రిస్మస్ ట్రీ ఉద్దేశ్యం మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం కాదని, రిసైక్లింగ్, సస్టైనబిలిటీపై అవగాహన కల్పించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇది ప్రజల్లో చర్చను రేకెత్తించే “కాన్వర్సేషన్ స్టార్టర్”గా రూపొందించామని తెలిపారు.
108MP కెమెరా, Snapdragon 6 Gen 3తో భారత్లో REDMI Note 15 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే..?
ఈ క్రిస్మస్ ట్రీ సంప్రదాయ కోన్ ఆకారంలో, ఆకుపచ్చ గ్లాస్ బీర్ బాటిళ్లను పైభాగాన్ని లోపలికి పెట్టి అమర్చారు. పైభాగంలో ఎరుపు నక్షత్రం, మధ్య మధ్యలో క్రిస్మస్ బబుల్స్, గంటలు, వృత్తాకార అలంకరణలు ఉన్నాయి. ఎరుపు కార్పెట్పై, ఈస్ట్ నడ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ట్రీని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే యూడీఎఫ్ నేతలు ఈ ట్రీ పట్టణంలో తప్పుడుసందేశం ఇస్తోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు కేపీ ఆర్షిద్ ఈ చర్యను సమర్థించలేమని, దీనికి బాధ్యులైన అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఈ ట్రీని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!