Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!
- ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సంప్రదాయ రంగం కార్యక్రమం
- రంగం కార్యక్రమంలో భవిష్యవాణి
- విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం కావడంపై అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ujjaini Mahankali Rangam: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన సంప్రదాయ రంగం కార్యక్రమంలో అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆమె భావోద్వేగంతో పాటు ఆగ్రహ స్వరంతో మాట్లాడారు. తనకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం కావడమే తన ఆగ్రహానికి కారణమని పేర్కొన్నారు.
భవిష్యవాణిలో ఆమె మాట్లాడుతూ.. “నేను సంతోషంగా రాలేదు.. ఆగ్రహంతో వచ్చాను. రెండు సంవత్సరాలుగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నా, ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదు. అయినా మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను కాపాడుతున్నాను. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు” అని అన్నారు.
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
అలాగే, ఈ ఏడాది ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదలతో పాటు అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయని, వాటి వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. పాడిపంటలు బాగుంటాయని కూడా అన్నారు. మరోవైపు ప్రజల ప్రవర్తనపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. లేకపోతే ప్రాణనష్టాలు కొనసాగుతూనే ఉంటాయి” అంటూ హెచ్చరించారు.
తన విగ్రహ ప్రతిష్ఠను మరో ఆరు నెలల్లో పూర్తి చేయాలని, అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె భవిష్యవాణిలో పేర్కొన్నారు. “నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే మీరు కోరినవన్నీ నెరవేరుస్తాను. నాకు చేయాల్సినది చేస్తే మీకు మేలు జరుగుతుంది” అని అన్నారు. భవిష్యవాణి అనంతరం రంగం కార్యక్రమం ముగిసింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు.
గమనిక: రంగం కార్యక్రమంలో చెప్పిన భవిష్యవాణులు ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి. వీటికి స్వతంత్ర శాస్త్రీయ ఆధారాలు లేవు.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!