BCCI: బీసీసీఐ కఠిన ఆంక్షలు.. ఇక నుంచి వారం రోజులు మాత్రమే!
- టీమిండియా పేలవ ప్రదర్శన
- బీసీసీఐ కఠిన ఆంక్షలు
- కుటుంబ సభ్యులకు అనుమతి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా పర్యటనల్లో క్రికెటర్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో ప్లేయర్ వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ నిబంధనలు అమల్లోకి వస్తే.. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పర్యటనల్లో భాగస్వామి, పిల్లలు 14 రోజుల కంటే ఎక్కువగా క్రికెటర్లతో ఉండటానికి వీల్లేదు. పర్యటనలో మొదటి రెండు వారాలు కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. 45 రోజుల కంటే కాలం పర్యటనల్లో కుటుంబ సభ్యులు గరిష్టంగా వారం రోజులు మాత్రమే ఉండాలి. ప్రాక్టీస్, మ్యాచ్ల సమయంలో ప్లేయర్స్ ఎవరైనా సరే వ్యక్తిగతంగా కాకుండా.. జట్టు బస్సులోనే ప్రయాణించాలి. ఈ నిబంధనలు ఆటగాళ్ల ఒప్పందాల్లో ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ సమయంలో సడలింపులు ఇచ్చారు. ఇప్పుడు మరలా వాటిని అమలు చేయనున్నారు.
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
Also Read: Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 3-1తో సిరీస్ ఓడిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో టీమిండియా ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. దాంతో శనివారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్తో బోర్డు అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్షతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మునుపటి నిబంధనల అమలు గురించి బోర్డు అధికారులు కెప్టెన్, కోచ్కు సమాచారం అందించారు. అయితే పర్యటనల్లో కుటుంబ సభ్యుల వసతి నిబంధనలో ఎలాంటి మార్పు ఉండదని బోర్డు వర్గాలు తెలిపాయి. పర్యటనల్లో కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల్ని క్రికెటర్లు సొంతంగా పెట్టుకుంటారన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
-
Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
-
CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!