IND vs PAK: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. పాకిస్తాన్ పర్యటనకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI President Roger Binny, Vice Rajeev Shukla To Travel To Pakistan for Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్లో నాలుగు మ్యాచ్లు, లంకలో మిగతా మ్యాచ్లు జరగనున్నాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పీసీబీ వద్దే ఉన్నా.. దాయాది దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా పాకిస్థాన్ వచ్చే ప్రసక్తే లేదని బీసీసీఐ చెప్పింది. చేసిదిలేక తటస్థ వేదికలపై మెగా టోర్నీ మ్యాచ్లను పీసీబీ నిర్వహిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు అన్ని లంకలోనే జరుగుతాయి.
పాకిస్థాన్లోని ముల్తాన్ వేదికగా ఆగస్ట్ 30న పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్తో ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్కు హాజరుకావాలని ఏసీసీ సభ్య దేశాలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానాలు పంపించింది. దాంతో భారత్ నుంచి బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జైషా హాజరవుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ వర్గాలు కొట్టిపడేశాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. పాకిస్థాన్లో జరిగే మ్యాచ్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే అధికారిక వర్గాల నుంచి ఆమోదం కూడా లభించిందట. అయితే బీసీసీఐ మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం భారత్ భారీ ప్లాన్.. ఏకంగా 15 మంది బౌలర్లు!
సెప్టెంబర్ 5న శ్రీలంక, అఫ్గానిస్థాన్ లాహోర్ వేదికగా జరగనుంది. ఇదే వేదికపై సెప్టెంబర్ 6న సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. ఒకవేళ సూపర్ 4 మ్యాచ్లో భారత్ తలపడితే.. ఆ వేదిక శ్రీలంకకు మారే అవకాశాలు ఉన్నాయి. జై షా, రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు సెప్టెంబర్ 2న శ్రీలంకలో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు హాజరవుతారని సమాచారం తెలుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత బిన్నీ, శుక్లా మాత్రమే లాహోర్కు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!