IND vs PAK: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. పాకిస్తాన్ పర్యటనకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI President Roger Binny, Vice Rajeev Shukla To Travel To Pakistan for Asia Cup 2023: పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్లో నాలుగు మ్యాచ్లు, లంకలో మిగతా మ్యాచ్లు జరగనున్నాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పీసీబీ వద్దే ఉన్నా.. దాయాది దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా పాకిస్థాన్ వచ్చే ప్రసక్తే లేదని బీసీసీఐ చెప్పింది. చేసిదిలేక తటస్థ వేదికలపై మెగా టోర్నీ మ్యాచ్లను పీసీబీ నిర్వహిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు అన్ని లంకలోనే జరుగుతాయి.
పాకిస్థాన్లోని ముల్తాన్ వేదికగా ఆగస్ట్ 30న పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్తో ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్కు హాజరుకావాలని ఏసీసీ సభ్య దేశాలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానాలు పంపించింది. దాంతో భారత్ నుంచి బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జైషా హాజరవుతారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ వర్గాలు కొట్టిపడేశాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. పాకిస్థాన్లో జరిగే మ్యాచ్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే అధికారిక వర్గాల నుంచి ఆమోదం కూడా లభించిందట. అయితే బీసీసీఐ మాత్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం భారత్ భారీ ప్లాన్.. ఏకంగా 15 మంది బౌలర్లు!
సెప్టెంబర్ 5న శ్రీలంక, అఫ్గానిస్థాన్ లాహోర్ వేదికగా జరగనుంది. ఇదే వేదికపై సెప్టెంబర్ 6న సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. ఒకవేళ సూపర్ 4 మ్యాచ్లో భారత్ తలపడితే.. ఆ వేదిక శ్రీలంకకు మారే అవకాశాలు ఉన్నాయి. జై షా, రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు సెప్టెంబర్ 2న శ్రీలంకలో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు హాజరవుతారని సమాచారం తెలుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత బిన్నీ, శుక్లా మాత్రమే లాహోర్కు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!