BCCI-Kohli: విరాట్ కోహ్లీపై బీసీసీఐ ప్రశంసల జల్లు..
- విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు
- పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన కోహ్లీ
- మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్,
- బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు. తన ఇన్నింగ్స్లో ఒత్తిడి ఉన్న అసాధారణమైన ఓర్పును ప్రదర్శించారని అన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా విరాట్ కోహ్లీలా మరే ఆటగాడు తట్టుకోలేడని బీసీసీఐ అధికారులు తెలిపారు.
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో.. దేశం తరపున ఎలా ఆడాలో చూపించాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.” అని అన్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ సెంచరీ అద్భుతంగా ఉంది. అతను భారత జట్టుకు స్థిరత్వాన్ని ఇచ్చాడు, అతని బ్యాటింగ్ వలన భారత్ విజయాన్ని సాధించింది” అన్నారు. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ సెంచరీ కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. అతని బ్యాటింగ్ విధానం నిజంగా గొప్పది. ఐపీఎల్ భారత క్రికెట్కు మేలు చేసిందని నా అభిప్రాయం” అని తెలిపారు.
Read Also: CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటి..?
విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్కు చేరుకునే అవకాశాన్ని దక్కించుకుంది. కాగా.. వన్డే క్రికెట్లో కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సెంచరీల ప్రపంచ రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో వన్డే అంతర్జాతీయ క్రికెట్లో చివరి సెంచరీ సాధించాడు.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!