Ponnam Prabhakar : బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- కులగణనపై బీఆర్ఎస్ నేతలకు మంత్రి సూచనలు
- సర్వే విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు అనవసరం
- సమగ్ర సర్వేలో పాల్గొని తమ హక్కుల కోసం కృషి చేయాలి: మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, చట్టాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో 96.9% మంది పాల్గొన్నారని, కేవలం 3.1% మంది మాత్రమే అందులో పాల్గొనలేదని వివరించారు. ఈ క్రమంలో, రెండో విడత కులగణన సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ హక్కులను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Falcon Scam : ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు
తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి దేశానికి దిక్సూచిగా నిలిచిందని పొన్నం ప్రభాకర్ గర్వంగా ప్రకటించారు. కులగణన సర్వేపై అనవసర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల ప్రయోజనాలను గుర్తించి ఇందులో పాల్గొనాలని సూచించారు. ఈ గణన వల్ల బీసీల అసలైన జనాభా గణనలోకి వచ్చి, వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, తమిళనాడు తరహాలో షెడ్యూల్-9 పెట్టాలని కేంద్రాన్ని కోరతామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారం అందిస్తారని, అలాగే తెలంగాణ బీజేపీ నేతలు కూడా బీసీల ప్రయోజనాలను గుర్తించి రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
సర్వేలో పాల్గొనడం వలన బీసీ జనాభా గణనకు సరైన దిశలో ఆందోళనలు నడిపించవచ్చని, బీసీల హక్కుల కోసం పోరాడే వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలని మంత్రి అన్నారు. అయితే, ఈ సర్వేను అర్థం చేసుకోకుండా, రాజకీయ కారణాలతో విమర్శలు చేయడం సరైన ధోరణి కాదని చెప్పారు.
“తెలంగాణ జనాభాలో లెక్కల్లో లేకూడదని భావించే వారిని సర్వేలో పాల్గొనాలంటూ మేము బ్రతిమిలాడబోము. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ బీసీ సంఘాల నేతలు, మేధావులు, ప్రజలు అందరూ కలిసి సమగ్ర సర్వేలో పాల్గొని తమ హక్కుల కోసం కృషి చేయాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ బీసీలకు సముచిత హక్కులు, సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుతో పాటు, సర్వే ద్వారా వారికున్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని, భవిష్యత్తులో మరింత ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తామని తెలిపారు.
Vishnuvardhan Reddy: కృష్ణా జలాలపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీకి క్షమాపణ చెప్పాలి
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!