Bareilly violence: ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం నెలకొంది. సెప్టెంబర్ 26న బరేలీలో దీనిపై ఆకస్మికంగా గుమిగూడిన ప్రజలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లకు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇత్తెహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్(IMC) చీఫ్ తౌకీర్ రజాను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి సన్నిహితులు, అనుచరులపై యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ ప్రారంభించింది.
Bulldozer Action: ఇటీవల ‘‘ ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా అల్లర్లకు కారణమైంది. బరేలీలో గత శుక్రవారం ప్రార్థనల తర్వాత గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఆ తర్వాత, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ అల్లర్లు కౌశాంబి, కాన్పూర్లతో పాటు గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి వివిధ ప్రదేశాలకు వ్యాప్తించాయి. అయితే, ఈ అల్లర్లకు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తేహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ (IMC) అధ్యక్షుడు తౌకీర్ రజా ఖాన్ను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్…
ఉత్తరప్రదేశ్లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు.
బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని సివిల్ లైన్స్లోని ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల గురువారం అర్థరాత్రి పలు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దిశా సోదరి ఖుష్బూ పటాని…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పేకాట ఆడుతూ ఆరుగురు మహిళలు పోలీసులకు పట్టుబడ్డ ఘటన ఉత్తరప్రదేశ్లోని సంజయ్నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు.. పేకాట ఆడుతున్న మహిళలను పట్టుకున్నారు. వారి నుంచి 52 ప్లేయింగ్ కార్డులతో పాటు మొత్తం రూ.2,780 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పెళ్లంటే ఎంత సంతోషం.. ఉల్లాసం ఉంటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారంటే.. అబ్బాయి-అమ్మాయికి ఎన్నో ఊహాలు ఉంటాయి. భార్యాభర్తలు అయ్యాక.. ఎన్నో ప్రణాళికలు.. ఎన్నో కలలు ఉంటాయి. అలాంటిది పెళ్లి కాక ముందే.. ఓ వరుడు చేసిన పనులకు వధువు అసహ్యించుకుని పెళ్లి పీటల మీద నుంచి దిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగింది.
Marriage: తప్పతాగిన వరుడు, వధువు మెడలో దండ వేయడానికి బదులుగా తన స్నేహితుడి మెడలో దండ వేయడంతో పెళ్లి క్యాన్సల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. మద్యం తాగి ఉన్న వరుడిని చూసిన వధువు, అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ సంఘటన తర్వాత పెళ్లి ఊరేగింపును కూడా వధువు వెనక్కి పంపింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ నిత్య పెళ్లికొడుకు చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. తాను పోలీసు అధికారినని చెప్పుకుంటూ ఐదుసార్లు వివాహం చేసుకున్నాడు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో జై పాలస్తీనా అనే నినాదానికి చెందిన అంశంపై 2025 జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.