Maharashtra ATS: 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ స్టేట్గా మార్చాలనుకుంటోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra ATS: గతేడాది కేంద్రంచే నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) 2047 నాటికి భారత్లో ఇస్లాం పాలనను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ క్లెయిమ్ చేసింది. విదేశాలు, ఇతర సంస్థలు తమ లక్ష్యాలను సాధించేందుకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పొందే ప్రణాళికలు కూడా ఉన్నాయని తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, దేశంపై యుద్ధం చేశారనే ఆరోపణలతో గతేడాది అరెస్టయిన ఐదుగురు పీఎఫ్ఐ సభ్యులపై గత వారం స్థానిక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో ఏటీఎస్ ఈ విషయాన్ని పేర్కొంది.
గత ఏడాది సెప్టెంబర్లో వివిధ రాష్ట్రాల్లోని బహుళ ఏజెన్సీలపై దాడులు చేసిన తర్వాత మహారాష్ట్ర ఐదుగురు పీఎఫ్ఐ సభ్యులైన మజర్ ఖాన్, సాదిక్ షేక్, మహ్మద్ ఇక్బాల్ ఖాన్, మోమిన్ మిస్త్రీ, ఆసిఫ్ హుస్సేన్ ఖాన్లను అరెస్టు చేసింది. వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, రాష్ట్రానికి వ్యతిరేకంగా కొన్ని నేరాలకు పాల్పడేందుకు కుట్ర పన్నినందుకు, అలాగే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఫిబ్రవరి 2న దాఖలు చేసిన చార్జిషీట్లో “ఇండియా 2047- భారతదేశంలో ఇస్లాం పాలన వైపు” అనే పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ పేర్కొంది. ఏటీఎస్ ప్రకారం.. స్వాధీనం చేసుకున్న ఆ పత్రం పీఎఫ్ఐ సభ్యులకు ప్రభుత్వాన్ని తారుమారు చేయడానికి ఒక రోడ్మ్యాప్ను అందిస్తుంది.
Also Read
Husband Lifts Wife Body: కన్నీళ్లు తెప్పించే హృదయ విదారక ఘటన.. భార్య శవాన్ని మోస్తూ..
“2047లో ముస్లిం సమాజానికి రాజకీయ అధికారం అందించేందుకు మేము కలలు కంటున్నాము దీని కోసం ముందుగా ఒక ప్రత్యేక రోడ్మ్యాప్ ఉన్న ముస్లిం సమాజం సామాజిక-ఆర్థిక అభివృద్ధితో మొదట రోడ్మ్యాప్ ప్రారంభమవుతుంది. ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ పేరుతో అందించబడింది” అని చార్జిషీట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆ పత్రం పేర్కొంది. “దీని కోసం ముస్లిం సమాజానికి దాని మనోవేదనలను పదేపదే గుర్తు చేయాలి. ఏదీ లేని చోట ఫిర్యాదులను స్థాపించాలి. పార్టీతో సహా మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్లన్నీ కొత్త సభ్యులను విస్తరించడం, రిక్రూట్ చేయడంపై దృష్టి పెట్టాలి” అని డాక్యుమెంట్ పేర్కొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను అగ్రవర్ణ హిందువుల సంక్షేమంపై మాత్రమే ఆసక్తి ఉన్న సంస్థగా చూపడం ద్వారా అనేక వర్గాల మధ్య చీలికను సృష్టించాలని పీఎఫ్ఐ భావిస్తున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది. నిందితులు తమ లక్ష్యాలను సాధించేందుకు అనేక శిక్షణా తరగతులు నిర్వహించారని ఏటీఎస్ తెలిపింది.
Muslim Law Board: నమాజ్ కోసం మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఉంది..
ఐసిస్ వంటి గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో లింకులు కలిగి ఉన్నారని, దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, సెప్టెంబర్ 2022లో కేంద్రం పీఎఫ్ఐ, దాని సహచరులను ఐదేళ్ల పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించింది. నిషేధానికి ముందు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), వివిధ రాష్ట్ర పోలీసు బలగాలు పీఎఫ్ఐపై దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశాయి.
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!