Bandi Sanjay: ఓవైసి, కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఏం చేసింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఓవైసి, కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లిం వారికి ఏం చేసింది? అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఓవైసి పోటు గాడు చార్మినార్ కే పరిమితమన్నారు. దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ దగ్గర ఎంఐఎం డబ్బులు తీసుకోవడం అలవాటు అని అన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని అన్నారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందని అన్నారు. బెంగాల్ లాగా బీఅర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ సగం మందికి టికెట్స్ రావని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని ఎద్దేవ చేశారు. 30 శాతం కమిషన్ అంటే కేసీఆర్ కుటుంబం, అవినీతి కుటుంబం అని బండి తెలిపారు. మళ్ళీ ఎన్నికలు రాగానే అమలు కాని హామీలు ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ఎలా కోటీశ్వరులు అయ్యారు? ఏం బిజినెస్ చేశారు? అంటూ ప్రశ్నించారు.
Read also: Traffic Alert: మంచిరేవులో కేసీఆర్ కోటి మొక్కలు నాటే కార్యక్రమం.. నార్సింగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
వైన్స్ షాప్ దంధాలు చేయడానికి, కేసీఆర్ కుటుంబం, అధికారులు ప్లీజ్ టెండర్ వేయండి అంటూ మార్కెటింగ్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 సక్సస్ అయింది..అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అక్కడ ఎలాంటి దందా చేయవచ్చు, అని ఆలోచన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దందా నెక్స్ట్ చంద్ర మండలం పై చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తుండు కేసీఆర్ అని మండిపడ్డారు. గవర్నర్ కి భయపడే సీఎం సయోధ్యకి వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లులు ఆమోదం కోసమే గవర్నర్ తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి ఆరోపించారు. నేను సీఎం కావాలని అనుకోవటం లేదు, అనుకునే వాళ్ళు మూర్ఖులు అని అన్నారు. ముందు రాక్షన ప్రభుత్వంను తొక్కాలని అన్నారు. బండి సంజయ్ ఎక్కడి నుండి పోటీ చేసేది అనేది అధిష్టానం చూసుకుంటుంది అని అన్నారు. సర్వేలు ఆధారంగా టికెట్ ఇస్తారు.. బీజేపీలో లాబియింగ్ ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారని బండి సంజయ్ తెలిపారు.
Hyderabad: భోలక్ పూర్ లో వింత ఘటన.. విషం పెట్టి పిల్లులను చంపారని ఫిర్యాదు
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!