Bandi Sanjay: హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపండి..
తెలంగాణలో మూర్ఖత్వం, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించాడు.. కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు.. దీనిపై ప్రశ్నించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాటసింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారు.. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ అన్నారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరని ఆయన తెలిపాడు.
Read Also: Relationship: అమ్మాయిలని ఆకర్షించుకోవడం ఎలా..? ఇలా చేస్తే ఇష్టపడతారట..!
Also Read
- Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
ముఖ్యమంత్రి ఫాంహౌజ్, ప్రగతిభవన్ లో పడుకున్నాడు.. సచివాలయం నీళ్లలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడు.. కేసీఆర్ దరిద్రపు మొఖాన్ని ఫస్ట్ పేజీలో చూపించాలనుకుంటున్నాడు.. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ కదా.. అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. ఏకంగా జీవిస్తున్నాడు అని ఆయన తెలిపారు. ఇవాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ తో ప్రచారం చేయిస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి..
ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలని అన్నాడు.
Read Also: Andhra Pradesh Crime News: ఆటోను దారి మళ్లించిన డ్రైవర్.. మహిళ ఏం చేసిందంటే..?
నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త నాకు సహకరించారు అని బండి సంజయ్ అన్నారు. చాలా కష్టపడి పనిచేశాననే తృప్తి నాకుంది.. అది చాలు అని ఆయన అన్నారు. నయా నిజాం పాలనను అంతమొందించాలన్నారు. నేను అధ్యక్షుడిని అయ్యాక చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు.. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆయన తెలిపారు. పాతబస్తీలోని బీజేపీ కార్యకర్తలు హీరోలు.. భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర మీటింగ్ పెట్టే దమ్ము ఎవరికుంది.. కాంగ్రెస్ కు లేదు, బీఆర్ఎస్ కు లేదు.. ఈ రెండు పార్టీలు నమాజ్ చేసి అక్కడ సభలు పెడుతాయి కావచ్చు.. కానీ బీజేపీ భాగ్యలక్ష్మీ అమ్మవారికి మొక్కి సభ పెట్టింది అని ఆయన అన్నారు. అది చార్మినార్ కాదు.. భాగ్యలక్ష్మీ అమ్మవారు కొలువైన భాగ్యనగరం.. పాత బస్తీ మీది కాదురా.. మాదేరా.. ఏ బస్తీ అయినా మాదేరా.. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!