Bandi Sanjay : 2019లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు బండి సంజయ్. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పిన విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థినిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామని, ఎస్టీ సామాజిక వర్గానికి వారు ఉన్నత చదువులు చదివి వారికున్న లక్ష్యాలను నెరవేర్చాలని సంకల్పంతో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశామని బండి సంజయ్ తెలిపారు.
Maa Nanna Superhero: ‘నాన్న’ను గుర్తు చేసేలా నాన్న సాంగ్
Also Read
దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య పాఠశాలలుంటే తెలంగాణలో 23 పాఠశాలలున్నాయి జిల్లాలోని రెండు పాఠశాలలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా భవనాలు లేని పాఠశాలకు 38 కోట్ల రూపాయలు నక్సల్స్ ప్రాంతాలకు 48 కోట్లతో నూతన భవనాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు బండి సంజయ్. ప్రతి పాఠశాలలో 480 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పటివరకు లక్షా ఇరవై వేల మంది ఉన్నత చదువులు చదివారని, తెలంగాణలో ఉన్న 23 ఏకలవ్య పాఠశాలలో 4000 మంది పైచిలుకు విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులు పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి నైపుణ్యాలు ప్రోత్సహించాలని పాఠశాలలు ఏర్పాటు చేశామని, విద్యార్థుకు ఉన్నత చదువులు చదివి వారి లక్ష్యాలకు చేరుకొని సమాజానికి మేలు చేయాలని కోరుతున్నామన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..