Bandi Sanjay-KCR: కేసీఆర్కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు!
- కేసీఆర్కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు
- కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం
- సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కరెక్ట్ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం కేసీఆర్కు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాల అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించా అని చెప్పారు. ఇక కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్పై సీఎం రేవంత్ మాట్లాడిని భాష సరికాదన్నారు. ఈరోజు మీడియా చిట్చాట్లో బండి సంజయ్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు.
‘కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. సీఎం తన భాషపై పునరాలోచన చేయాలి. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది. కేసీఆర్ కుమారుడు అహంకారం తలకెకినట్టు మాట్లాడుతారు. గతంలో కేసీఆర్ మాట్లాడితే మేము ఖండించాం. సీఎం రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
Also Read
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
Also Read: Eesha Movie Review: ‘ఈషా’ మూవీ రివ్యూ!
‘తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ఏమీ చేశారో ఆధారాలతో సహా బయట పెట్టింది ముందు నేనే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారు. ముడుపుల కోసం 575 టీఎంసీలు అడగలేదు. కేసీఆర్కు కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు లేదు. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టించాను. కాళేశ్వరం స్కాం నుంచి దృష్టి మరల్చేందుకు కేసీఆర్ కృష్ణ జలాలు ఇష్యూ తెరపైకి తెస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలి. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని. డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!