Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bandi Sanjay Said That If The Congress Is Sincere The Promises Should Be Implemented Within 15 Days

Bandi Sanjay: చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో హామీలను అమలు చేయండి..

NTV Telugu Twitter
Published Date :February 21, 2024 , 6:25 pm
By Rajesh Veeramalla
Bandi Sanjay: చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో హామీలను అమలు చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’అని సూచించారు. రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని, 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తీసుకొచ్చి జీతభత్యాలు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం వద్దకు వెళ్లి తెలంగాణకు అధిక నిధులు తీసుకొచ్చేందుకు అవకాశముందన్నారు. ‘‘బీజేపీ వైపు రాముడు, మోడీ ఉన్నాడు… కాంగ్రెస్ వైపు రాహుల్, రజాకార్లు, కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. ఎవరు ఏ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి.. రాముడి వారసుడైన మోడీ రాజ్యం కావాలా? రజాకార్ల రాజ్యం కావాలా? ఆలోచించండి’’అంటూ ప్రజలను కోరారు.

కొమురం భీం విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్.. స్థానిక ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి వెయ్యి ఊడల మర్రిని సందర్శించారు. రాంజీగోండు స్మారక కేంద్రం వద్ద ఒక వర్గానికి చెందిన వ్యక్తి సమాధి ఉండటంతో స్థానికులంతా బండి సంజయ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లి రాంజీగోండు స్ర్ముతి కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుండి బీజేపీ నేతలతో కలిసి బోథ్ నియోజకవర్గం వెళ్లిన బండి సంజయ్ విజయ సంకల్ప యాత్ర రథమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ నెరడిగొండ, ఇచ్చోడకు వచ్చారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారని మనమెవరం ఊహించలేదని.. కరసేవకుల త్యాగాలు వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆ కలను నెరవేర్చిన మహనీయుడు నరేంద్రమోదీ అని అన్నారు. ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీదేనని తెలిపారు. ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్న నాయకుడు మోడీ.. దీంతోపాటు వేలాది కోట్లతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులిస్తున్నాడు.. కోట్లాది గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు నిర్మించిన నేత మోడీ అని పేర్కొన్నారు. మరోవైపు.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు పనీపాట లేదు.. కొత్త స్కాచ్ బాటిల్ టేస్ట్ చూడటానికే ఢిల్లీ వెళుతున్నాడని విమర్శించారు. ఆయనతో చర్చలు జరపాల్సిన కర్మ బీజేపీకి లేదని.. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోలేదు.. ప్రజలు ఛీత్కరించిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ తమకెందుకు అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • congress govt
  • modi
  • telangana

తాజావార్తలు

  • Suicide : పెళ్లయిన మూడున్నర నెలలకే వేధింపులు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

  • Fake Gold : తక్కువ ధరకే బంగారం కోటి లూటీ..

  • Fraud: డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు.. జస్ట్ 2 లక్షల రూపాయలు మాత్రమే..!!

  • Kuberaa : కుబేర ఓవర్శీస్ రివ్యూ..

  • Axiom-4: ఆక్సియం -4 మిషన్ ప్రయోగాన్ని మళ్ళీ వాయిదా వేసిన నాసా..

ట్రెండింగ్‌

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions