Bandi Sanjay : నేషనల్ హైవే పనులపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బండి సంజయ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రహదారుల విస్తరణ పనులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఈరోజు ఎల్కతుర్తి- సిద్దిపేట (NH-765DG) జాతీయ రహదారి విస్తరణ పనులుసహా ఇతర రహదారుల పనుల పురోగతిపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ప్రధానమంత్రి నరంద్రమోదీ చేతుల మీదుగా గతేడాది నవంబర్ 12న సిద్దిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. నాటి నుండి చేపట్టిన పనుల పురోగతితోపాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏయే పనులు చేపట్టాలనే పనులపై సమీక్షించారు. మొత్తం 578.85 కోట్ల రూపాయలతో చేపట్టిన 63.641 కి.మీల మేర పనులు కొనసాగుతున్నట్లు అధికారులు ఈ సందర్భంగా బండి సంజయ్ కు వివరించారు.
Also Read : Minister Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స, సజ్జల భేటీ
Also Read
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
అందులో భాగంగా సిద్దిపేట జిల్లా రంగధామంపల్లి బ్రిడ్జి నుండి ఎల్కతుర్తి జంక్షన్ వరకు మిట్టపల్లి, ముండ్రాయి, పల్మాకుల, బద్దిపడగ, బస్వాపురం, సముద్రాల, పందిళ్ల, హుస్నాబాద్, పోతారం(ఎస్), జిల్లెలగడ్డ, ముల్కనూర్, కొత్తపల్లి, ఇందిరానగర్, ఎల్కతుర్తి గ్రామాల మీదుగా రహదారి విస్తరణ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ఈ పనుల్లో భాగంగా బస్వాపూర్, పందిళ్ల వద్ద నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 26 మైనర్ బ్రిడ్జీల పునర్నిర్మాణం వివరాలను ఈ సందర్భంగా బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ రహదారి విస్తరణ పనుల్లో బాగంగా కల్వర్టు నిర్మాణం, జంక్షన్ ఇంప్రూవ్ మెంట్, రీ అలైన్ మెంట్లు, స్ట్రక్చర్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు.
Also Read : Ashu Reddy : కింద నుంచి పై వరకు బ్రాండులే.. డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయి పాప
ఈ రహదారిపై ప్రయాణించే ప్రజల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గ్రుహాలు, మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ముల్కనూరు డెయిరీ సంస్థకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టాలని పేర్కొన్నారు. రహదారి విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వివరాలను సైతం బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!