Bandi Sanjay: యాదాద్రిని కాదు.. మీ నోటిని యాసిడ్ తో కడగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మునుగోడులో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కి చెందిన 16 మంది మంత్రులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువు అంటే అర్థం తెలుసా. నువ్వు నీ అయ్యను కొడతావు.. డ్రగ్స్ తీసుకొని నువ్వు, మందు తాగి నీ అయ్య సోయి లేకుండా ఏమి చేస్తున్నారో మీకు తెలియదు…చెప్పులు గురువులకు అందిస్తాం… గురు శిష్యుల బంధం అది అన్నారు.
గుడిని ఎందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. మీది మీ అయ్యది నోరు యాసిడ్ తో సంప్రోక్షణ చేయాలని ఎద్దేవా చేశారు. ఆ గుడి చాలా పవర్ ఫుల్… తప్పు చేసిన వాడు ఎవ్వడు ఆ గుడికి తడి బట్టలతో వెళ్ళడన్నారు బండి సంజయ్. నీవు నాస్తికుడివు కదా… దేవుణ్ణి నమ్మవు కదా.. మిమ్మల్ని గద్దె దించి తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…అయ్యా కొడుకులు నోరు హద్దుల్లో పెట్టుకోవాలి…నీ ఎమ్మేల్యేలు తప్పు చేయక పోతే ప్రగతి భవన్ లో ఎందుకు పెట్టుకున్నావన్నారు బండి సంజయ్. 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటారు… అధికారంలోకి రాగానే వారికి టెస్ట్ లు చేస్తాం… కెసిఆర్ కుటుంబ సభ్యులతో సహా అన్నారు. కృష్ణ జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందే కెసిఆర్. ఏపీ సీఎంతో లాలూచీ పడి మనకు రావాల్సిన నికరజలాలను వదులుకున్నారన్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Read Also: Hari Hara Veeramallu: రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్.. కానీ?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని ఆరోపణలున్నాయి.. దేవుడి ముందు వారు ప్రమాణం చేయాలి.. కర్నాటకలో రోహిత్ రెడ్డి మీద డ్రగ్స్ కేసు ఉందన్నారు బీజేపీ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. మునుగోడులోని చండూరు రోడ్డులో మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు తరుణ్ చుగ్, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, బండి సంజయ్ ,వివేక్ వెంకట స్వామి, గంగిడి మనోహర్ రెడ్డి,బోడిగే శోభ, బాబూమోహన్, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయ రామారావు, కర్ణాటక కోలార్ ఎంపీ మునుస్వామి.
Read Also: Pawan Kalyan: ‘అలీతో సరదాగా’ టాక్ షోకు గెస్టుగా పవర్స్టార్.. ఇది నిజమేనా?
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!