Bandi Sanjay : ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారు..
- నేను అశోక్ నగర్కి వెళ్తాను... నిరుద్యోగుల తరపున పోరాడుతా
- సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం స్పందించాలి
- షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు... ఇదేం పద్ధతి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు ఆడుతోంది… 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30 వేల జాబ్స్ ఇచ్చామంటున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు… అమలు చేయడం లేదని, గత ప్రభుత్వనికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదన్నారు. నోటిఫికేషన్ల విషయంలో కేసీఆర్ ఆలోచనా విధానం కాంగ్రెస్ అమలు చేస్తూ… కోర్ట్ కేసులు, నోటిఫికేషన్ లోపాలు చేస్తున్నారని, నిరుద్యోగులకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నాడన్నారు. సిగ్గుందాలి.. కేటీఆర్ పదేళ్ళలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని ఇప్పుడు పోరాటం అంటున్నారని, పేపర్ లీకేజీలకు, కోర్ట్ కేసులకు విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు.
Viral: బాయ్ఫ్రెండ్ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?
Also Read
అంతేకాకుండా..’నేను అశోక్ నగర్ కి వెళ్తాను… నిరుద్యోగుల తరపున పోరాడుతా… సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం స్పందించాలి.. విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు తారుమారు అయ్యాయి… అశోక్ నగర్ లో మొదలైన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించక ముందే ప్రభుత్వం దిగిరావాలి కేంద్ర మంత్రిగా కాకుండా.సామాన్య కార్యకర్తగా వెళ్తాను. గతంలో కేసీఆర్ కాళేశ్వరం అని పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టి లక్షకోట్లు ముంచాడు. ఇప్పుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ మాతో మోసానికి తెరలేపారు. ప్రభుత్వం హైడ్రా పై పునరాలోచన చేయాలి… 12 వేల కుటుంబాలను ముంచి పొట్టగొట్టి మూసి సుందరికరణ దేనికి…? మూసి సుందరికరణ కోసం ప్రపంచ బ్యాంకు ముందు కాంగ్రెస్ సర్కారు సాగిలపడింది.. పేదలు అన్ని పర్మిషన్లు తీసుకుని కట్టిన ఇళ్లను ఎలా కూలగొడతారు… అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి.. హైడ్రా అంటే ప్రజలకు భూతంలా కనిపిస్తుంది… హైడ్రా అంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. హైడ్రా, గ్రూప్ వన్ అంశాలను ఆసరా చేసుకుని రేవంత్ ని దించేందుకు కొందరు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలును పక్కదారి పట్టించేందుకు ఈ వివాదాలు రేపుతున్నారు…’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?