Bandi Sanjay : విజయశాంతికి ఈ పార్టీనే చివరి మజిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. విజయశాంతికి ఈ పార్టీనే చివరి మజిలీ అని ఆయన అన్నారు. కేసీఆర్ వల్ల ఎందరో మోసపోయారని, అడ్డంకులు లేకుండా ఆమె లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీలో ఎవరైనా ఏ పదవి అయినా రావొచ్చని ఆయన వెల్లడించారు. పార్లమెంట్లో జై తెలంగాణ అని గర్జించింది విజయశాంతి అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ జిమ్మిక్కులుతో నమ్మించి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన మండిపడ్డారు. చాలా మంది బీజేపీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. పార్టీనీ వీడి వెళ్ళిన వారు తిరిగి రావాలని కోరుతున్నానన్నారు. ఘర్ వాపసి .. కలిసి పోరాటం చేద్దామని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విజయశాంతి మాట్లాడుతూ.. 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం.. బీజేపీ సిద్దాంతం, క్రమశిక్షణ నచ్చి 1998 లో పార్టీ లో చేరానన్నారు. తెలంగాణకు ఏదో చేయాలని తపన ఎప్పుడు ఉండేదని, సోనియా గాంధీకి పోటీగా ఉండాలని అద్వానీ చెప్పారన్నారు.
Also Read : Vijayashanti : సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యాను
Also Read
- Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
- 11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
- India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు యువ ఆల్రౌండర్ దూరం!
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యానని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూలి పోయే పరిస్థితి వచ్చిందని, బ్లాక్ మెయిల్ చేశారన్నారు. సమైక్య వాదుల ఒత్తిడి వల్ల 2005లో నేను బీజేపీకి రాజీనామ చేశానని, తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఎన్నో వ్యయ పర్యవసానాలు ఎదుర్కొన్నానన్నారు. ఆ సమయంలో ఒక రాక్షసుడు కేసీఆర్ ఎంటర్ అయ్యాడని, నమ్మదగ్గ వ్యక్తి కాదని నాకు అప్పుడే అర్థం అయిందన్నారు. లొంగదీసి పార్టీలో విలీనం చేసుకోవాలని చూసాడన్నారు. వ్యక్తిత్వాన్ని కించ పరిచే ప్రయత్నం చేశాడని ఆమె వ్యాఖ్యానించారు. తప్పని సరి పరిస్థితిలో విలీనం చేశానని, ఏనాడు సంతృప్తిగా లేనన్నారు. నన్ను ఎంపీగా ఓడగొట్టాలని కేసీఆర్ చూసాడని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
-
Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
-
Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం… మోడీ లెక్క ఇదే!
-
Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!