PM Modi: మోడీకి లేఖ రాసిన బలూచిస్థాన్ జర్నలిస్ట్.. కీలక అంశాలు వెల్లడి..!
- ప్రధానికి లేఖ రాసిన బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త
- తమకు మద్దతు ప్రకటించాలని కోరిన మీర్ యార్ బలూచ్
- పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించిన జర్నలిస్ట్ మీర్ యార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను జప్తు చేయాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. బలూచిస్థాన్ స్వాతంత్ర్య పోరాటంలో భారతదేశం బహిరంగంగా మద్దతు ఇవ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.
READ MORE: MP: లిఫ్ట్లో ఇరుక్కున్న కొడుకు.. భయాందోళనతో తండ్రి మృతి
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ లేఖను మీర్ యార్ బలోచ్ 1998 మే 28న బలూచిస్థాన్ లోని చాగైలో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలతో ప్రారంభించారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ సహకారంతో పాకిస్థాన్ సైన్యం బలూచ్ భూమిని నాశనం చేసిందని రాసుకొచ్చారు. ఈ పేలుళ్ల కారణంగా.. చాగై, రాస్ కో కొండలలో పేలుడు పదార్థాల వాసన ఇప్పటికీ అలాగే ఉందన్నారు. ఈ పరీక్ష కారణంగా అనేక పొలాలు నాశనమయ్యాయని, పశువులు చనిపోయాయని, పిల్లలు వికలాంగులుగా జన్మించారని పేర్కొన్నారు.
READ MORE: Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
అలాగే.. ఆ లేఖలో బలూచ్ నాయకుడు పాకిస్థాన్ ఆర్మీ.. ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలకు సపోర్టు చేస్తుందని బహిరంగంగా నిందించారు. ఐఎస్ఐ ప్రతి నెలా ఓ కొత్త ఉగ్రవాద సంస్థను సృష్టిస్తుందని, వారిని భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్థాన్, అమెరికా, ఇజ్రాయెల్లపై దాడుల కోసం ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ బలూచిస్థాన్లోని బంగారం, రాగి, గ్యాస్, చమురు, యురేనియంను దోచుకుంటుందన్నారు. వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను నడుపుతోందని విమర్శించారు. ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. ఆ లేఖలో చైనా గురించి కూడా ప్రస్తావించారు. చైనా పాకిస్థాన్ సైన్యానికి మద్దతు ఇస్తోందని వివరించారు. తాము భారతదేశానికి మద్దతు ఇచ్చాము. ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే న్యూఢిల్లీలో బలూచిస్థాన్ రాయబార కార్యాలయాన్ని నిర్మించుకునేందకు అవకాశం కల్పించాలని లేఖలో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!