మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమారుడు లిఫ్ట్ ఎక్కగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భయాందోళనకు గురై ఏడ్వడం మొదలుపెట్టాడు. బిడ్డకు ఏమైందో ఏమోనని ఆ తండ్రి కంగారు పడ్డాడు. వెంటనే జనరేటర్ కోసం అపార్ట్మెంట్ కిందకి పైకి ఎక్కుతూ గుండె అలసిపోయింది. అంతే అక్కడికక్కడే తండ్రి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇంతలోనే కరెంట్ రావడంతో కుమారుడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. కుటుంబ రోదన వర్ణణాతీతం అయింది.
ఇది కూడా చదవండి: CHAKRASIDDH : డా. భువనగిరి సత్య సింధుజ, చక్రసిద్ధ్ రీసెర్చ్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డులు
భోపాల్లోని రాయల్ ఫామ్ విల్లా కాలనీలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భీకరమైన గాలులు వీచాయి. 51 ఏళ్ల రిషిరాజ్ భటానగర్, 8 ఏళ్ల చిన్న కుమారుడు దేవాన్ష్ లిఫ్ట్లోంచి ఫ్లాట్కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దేవాన్ష్ లిఫ్ట్ ఎక్కాడు.. ఇంతలో కరెంట్ పోయింది. దీంతో భయాందోళనకు గురైన దేవాన్ష్ ఏడ్వడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి జనరేటర్ గది వైపు పరుగెత్తాడు. మెట్లు ఎక్కుతూ.. దిగుతూ ఉండడంతో గుండె వేగంగా కొట్టుకుంది. తీవ్రంగా అలసిపోవడంతో అక్కడికక్కడే రిషిరాజ్ భటానగర్ చనిపోయాడు. 3 నిమిషాల్లోనే కరెంట్ రావడంతో దేవాన్ష్ క్షేమంగా వచ్చేశాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. భటానగర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇది కూడా చదవండి: Chandrababu: రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..