Balmoor Venkat : ప్రజల్లో రాహుల్గాంధీపై పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకపోతున్నారు
- రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేత దిష్టిబొమ్మ దహనం
- బీజేపీ నాయకులు రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
- రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీస్ లు అట్టెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలన్నారు బల్మూరి వెంకట్. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీజేపీ నాయకులు ఇష్టంవచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని బీజేపీ నాయకులు భయపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Chit Fund Fraud: చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.50 లక్షలతో పరారీ
Also Read
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
- AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్నినోపై చర్చ!
ప్రజల్లో రాహుల్ గాంధీపై పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. లేదంటే బీజేపీ నాయకులను తిరుగనివ్వమని బల్మూరి వెంకట్ అన్నారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. దీంతో.. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా.. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు కాంగ్రెస్ నేతలు.
నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో.. నయనతార రొమాంటిక్ ఫొటోలు వైరల్!
తాజావార్తలు
-
Rainbow Children’s Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
-
West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
-
Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Thudakkam : 9 రోజుల్లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. స్టార్ హీరో కూతురుకు తొలిసినిమాతోనే భారీ హిట్
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?