Balineni Srinivas Reddy: ఎంపీగా మాగుంటకు అవకాశం రావాలని కోరుకుంటున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivas Reddy: ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీలు వచ్చినా ఒంగోలులో టీడీపీ నేతలు అడ్డుకోవటం వల్ల ఆలస్యం అయ్యిందని బాలినేని మండిపడ్డారు. పట్టాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి వైదొలగాలని నిశ్ఛయించుకున్నా.. కానీ సీఎం జగన్ దయతో అది సాధ్యమైందన్నారు.
Read Also: Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదం వెనుక రాజకీయ కుట్ర.. గంటా సంచలన వ్యాఖ్యలు
Also Read
మౌళిక సదుపాయాల కల్పన పూర్తిచేసి వచ్చే నెల 10వ తేదీ లోపు సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఓ నిర్ణయం తీసుకున్నానన్న మాజీ మంత్రి బాలినేని.. 25 వేలమందికి పట్టాలు ఇవ్వటమే కాదు.. ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు కృషి చేస్తా.. రెండు ప్రాంతాలు రెండు సిటీల్లా రూపుదిద్దుకుంటాయన్నారు. ఎంపీగా మాగుంటకు అవకాశం రావాలని భగవంతుడ్ని.. మా సీఎంను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. మాగుంటకు సీటు కోసం ప్రయత్నాలు చేస్తునే ఉన్నా.. ఆయన కూడా 30 ఏళ్ల నుంచి మాతోనే ఉన్నారని బాలినేని తెలిపారు. ఎవరు సపోర్ట్ చేసినా.. చేయకున్నా వైపాలెం అభ్యర్థిని గెలిపించుకునే భాద్యత నాది.. గెలిపించుకుని వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి సురేష్ కూడా సపోర్ట్ చేస్తారు.. ఆయన సపోర్ట్ చేయనని చెప్పలేదు కదా అంటూ వ్యాఖ్యానించారు. సామరస్యంగా జిల్లాలో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం.. అభ్యర్దులందరిని గెలిపించుకుంటామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!