Balaram Naik : బంజారాలను 8వ షెడ్యూల్ లో చేర్చాలి
- కొనసాగుతున్న లోక్సభ సమావేశాలు
- జీరో అవర్లో మాట్లాడిన ఎంపీ బలరాం నాయక్
- 12 నుంచి 16 కోట్ల మంది బంజారాలను 8వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్
- వివిధ పేర్లతో పిలవబడే బంజారాలు మన విభిన్న సాంస్కృతిలో ముఖ్యమైన భాగమన్న బలరాం నాయక్
లోక్సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత సభలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేంద్రం (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్కు గత లోక్సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. అయితే.. లోక్ సభలో జీరో అవర్లో ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 12 నుంచి 16 కోట్ల మంది బంజారాలను 8వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. బంజారా భాష అయిన గోర్-బోలికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాని నేను ఈరోజు మాట్లాడుతున్నానని, మన దేశంలో గోర్, గౌర్ బంజారా, లామన్, లంబానీ, లంబాడీ, గౌర్ రాజ్పుత్, నాయక్, బల్దియా , గౌరియా వంటి వివిధ పేర్లతో పిలవబడే బంజారాలు మన విభిన్న సాంస్కృతిలో ముఖ్యమైన భాగమన్నారు బలరాం నాయక్.
Antim Panghal: అక్రిడిటేషన్ రద్దు గురించి అంతిమ్ పంఘల్ ఏం చెప్పిందంటే..?
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
సుమారు 10 నుండి 12 కోట్ల జనాభాతో, వీరూ దేశం అంతటా విస్తరించి ఉన్నారు, విరి ప్రత్యేక భాష అయిన గోర్-బోలిని బంజారా, లమాని, లంబాడి, గోర్మతి లేదా బంజరీ అని కూడా పిలుస్తారని, భారతదేశంలోని బంజారాలు ఒకే భాష మాట్లాడతారు. నిజానికి మన దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష గోర్-బోలి. అయితే, ఈ భాషా సంపద తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందన్నారు. గోర్-బోలికి లిపి లేదు. శతాబ్దాలుగా, ఇది మౌఖిక సంప్రదాయాల ద్వారా మాత్రమే మనుగడలో ఉంది, ఫలితంగా నమోదు చేయని సాహిత్యం వచ్చిందని, ఈ వ్రాతపూర్వక డాక్యుమెంటేషన్ లేకపోవడం వివక్షకు దారితీయడమే కాకుండా బంజారా సమాజం యొక్క మొత్తం సాంస్కృతిక వారసత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు బలరాం నాయక్. బంజారాలు, చరిత్ర లేకుండా, వారి ప్రత్యేక భాష, వేషధారణ, సంస్కృతి , సంప్రదాయాలను కొనసాగించగలిగారు. కానీ తక్షణ చర్య లేకుంటే, మన జాతీయ వారసత్వంలో ఈ అమూల్యమైన భాగాన్ని కోల్పోతామని, మీ ద్వారా గౌరవ హోం మంత్రి గారిని అభ్యర్థిస్తున్న భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గోర్-బోలిని చేర్చండన్నారు. ఈ డిమాండ్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పెండింగ్లో ఉంది , బంజారా కమ్యూనిటీ యొక్క గుర్తింపు పరిరక్షణకు కీలకమైనది. గోర్-బోలి ఒక భాష మాత్రమే కాదు; అది బంజారా ప్రజల హృదయం , ఆత్మ వంటిదన్నారు బలరాం నాయక్.
Bomb Making: యూట్యూబ్ చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు..చివరకి.?
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!