Delhi: BAI బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ భారత జూనియర్ జట్టు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ 2023 కోసం భారత జూనియర్ జట్టును ప్రకటించింది. జూలై 7 నుండి 16 వరకు ఇండోనేషియాలోని యోగ్యకార్తాలో కాంటినెంటల్ ఛాంపియన్షిప్లు జరుగనున్నాయి. జట్టులో కీలకంగా ఉన్న తారా షా మరియు ఆయుష్ శెట్టి ఛాంపియన్ షిప్ లో పాల్గొననున్నారు. తారా షా బాలికల సింగిల్స్ విభాగంలో నైపుణ్యంతో కూడిన ఆట పట్టుదలతో దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో బాలికల సింగిల్స్ విభాగంలో 7వ ర్యాంక్లో ఉన్న తారా షా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్ జట్టులో కీలక క్రీడాకారిణిగా ఆమె స్థానం మరింత పటిష్టం కానుంది.
Read Also: Minister Harish Rao: త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభం
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
అటు బాలుర సింగిల్స్ విభాగంలో కూడా ఆయుష్ శెట్టి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. BWF ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్లో ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ 20వ స్ధానంలో ఉన్నాడు. BAI ర్యాంకింగ్స్లో రెండవ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా జట్టుకు ఆయుష్ సీనియర్ గా.. ఉండి నడిపిస్తున్నాడు. అటు ట్రయల్స్లో లక్ష్య శర్మ మరియు రక్షిత శ్రీ ఎస్ కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు. బాలుర సింగిల్స్ మరియు బాలికల సింగిల్స్ కేటగిరీలలో వరుసగా మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు జరగబోయే ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పతకాలు సాధించాలని వారు చూస్తున్నారు.
Read Also: Rana : నిర్మాతగా రాణించాలి అనుకుంటున్న రానా..?
నికోలస్ నాథన్ రాజ్ మరియు తుషార్ సువీర్ అద్భుతమైన టీమ్వర్క్ తో బాలుర డబుల్స్ విభాగంలో వారు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అటు బాలికల డబుల్స్ విభాగంలో, రాధికా శర్మ మరియు తన్వి శర్మ వ్యూహాత్మక గేమ్ ప్లాన్లను ప్రదర్శించారు. దీంతో వారు మొదటి స్థానానికి వచ్చారు. అటు సమరవీర్ మరియు రాధిక శర్మ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి ఛాంపియన్షిప్లకు ఎంపికయ్యారు.
అటు జట్టు ప్రకటనపై BAI సెక్రటరీ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, “జట్టులో స్థానం సంపాదించడానికి ఆటగాళ్లు ట్రయల్స్ సమయంలో తీవ్రంగా పోరాడారని తెలిపారు. యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటానికి ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లు మంచి వేదిక అన్నారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!